కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో మొదట్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. లాంగ్ రన్లో దెబ్బతింది.
Also Read:Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి కేంద్రం సన్నాహాలు
ఆడియన్స్ ఏ సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారో గ్రహించిన సూర్య.. అటుగా మూవ్ అవుతున్నాడు. సౌత్లో మార్కెట్ పెంచుకోవాలన్నా.. పాన్ ఇండియా లెవల్లో రేంజ్ పెరగాలన్నా లోకల్ బాయ్స్తోనే కాదూ.. అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్లకు ఛాన్సులివ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అలా మొదలెట్టిన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇప్పటికే సూర్య 46తో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరికీ ఛాన్స్ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల టచ్లోకి వచ్చేశాడు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో కాస్తో కూస్తో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య.. ఇప్పుడు మరింతగా మార్కెట్ పెంచుకునేందుకు తెగ ట్రై చేస్తున్నాడు.
Also Read:Kalvakuntla Kavitha: ‘నాన్నా’ జాగ్రత్త.. మీ వెనక భారీ కుట్ర జరుగుతోంది!
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు కంప్లీట్ చేసిన సూర్య.. ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమాతో పాటు… మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సారి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ను లైన్లో పెట్టినట్లు సమాచారం. రొమన్ చామ్, ఆవేశం తదితర చిత్రాలతో భారీ సక్సెస్ అందుకున్న జీతూతో సూర్య 47 ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్గా నజ్రియాను ఫైనల్ చేయనున్నారట. త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. లోకల్ దర్శకులను కాస్త పక్కన పెట్టి.. యంగ్ అండ్ డైనమిక్ నాన్ కోలీవుడ్ దర్శకులతో వర్క్స్ స్టార్ట్ చేసిన సూర్య.. మార్కెట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.