Shankar- Ranveer Singh: రణ్ వీర్ సింగ్ తో శంకర్ ‘వేల్ పరి’ ట్రయాలజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shankar- Ranveer Singh: ‘ఇండియన్ 2’, ‘అపరిచితుడు’ రీమేక్ రైట్స్ వివాదాల నుంచి దర్శకుడు శంకర్ బయటపడ్డారు. ప్రస్తుతం రామ్ చరణ్తో RC15, కమల్ హాసన్తో ‘భారతీయుడు 2’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాదు హిందీలో రణవీర్ సింగ్తో ‘అపరిచితుడు’ తీస్తానని ప్రకటించిన దానికి భిన్నంగా వేరే ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మణిరత్నం అడుగుజాడల్లో నడవబోతున్నాడట శంకర్. మణిరత్నం ప్రముఖ తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా రెండు భాగాలుగా సినిమా తీసి మొదటి భాగంతో సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు శంకర్ కూడా మణిరత్నం లాగే ఫేమస్ నవల వేల్ పరి ఆధారంగా రణ్ వీర్ తో మూడు భాగాలుగా సినిమా తీయాలనుకుంటున్నాడట. సంగమ్ ఎరాలో పరంబునాడు ని ఏలిన వేల్ పరి అనే రాజు గురించిన కథే ఈ నవల. సంగమ్ ఎరా కాలం నాటి ప్రముఖ కవి కపిలర్ రాసిన నవల ఇది.
Read also: Polish Leader: యువతుల అతి మద్యపానమే సంక్షోభానికి కారణం.. పోలిష్ నేత సంచలన వ్యాఖ్యలు
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
- Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
చేర, చోళ, పాండ్య రాజులు రాజ్యకాంక్షతో నిర్దాక్షిణ్యంగా విస్తరించుకుంటూ పోయారు. స్వతంత్ర రాజులపై దండెత్తి వారిని అధీనంలోకి తీసుకుని వారి రాజ్యాలను సమీకరించారు. అలాగే పరంబు దేశాన్ని కూడా ముట్టడించారు. అయితే వేల్ పారి రాజు లొంగిపోవడానికి నిరాకరించటంతో యుద్ధం సంవత్సరాలపాటు సాగింది. వేల్ పారిని జయించలేని యోధుడని కీర్తిస్తూ వెనుదిరిగి వెళ్ళారు. ఈ నవల అద్భుతమైన సినిమా అడాప్టేషన్గా మార్చే అంశాలను కలిగి ఉండటంతో శంకర్ దృష్టి దీనిపై పడింది. జీవిత పాఠాలతో పాటు హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ, యాక్షన్ అడ్వెంచర్ కు స్కోప్ ఉండటంతో వీటిని మైండ్బ్లోయింగ్ విజువల్-ఎఫెక్ట్ సీక్వెన్స్లుగా ప్రొజెక్ట్ చేసే స్కోప్ ఉంది. అందుకే దీనిని భారీ బడ్జెట్తో బహుళ భారతీయ భాషల్లో మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నాడు శంకర్. రణ్వీర్ సింగ్తో ‘వేల్ పారి’ ప్రాజెక్ట్ను ప్రారంభించే ముందు శంకర్ రామ్ చరణ్ సినిమాతో పాటు కమల్ ‘భారతీయుడు 2’ని పూర్తి చేస్తాడట. ఈ లోగా అటు రణ్ వీర్ కూడా రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ సినిమాలు ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’, సంజయ్ లీలా బన్సాలీ ‘బైజు బావ్రా’ పూర్తి చేస్తాడని టాక్. మరి మణిరత్నం అడుగుజాడల్లో నడవబోతున్న శంకర్ దీనితో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Crime in Hyderabad: రెండో భర్తతో భార్య.. పెట్రోల్ పోసి నిప్పంటిచిన మొదటి భర్త
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!