రష్మిక కోసం 900 కిమీ నడిచిన అభిమానికి నిరాశ… స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఛలో” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం రష్మిక మందన్న ఆ తరువాత వెనక్కి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకదాని తరువాత ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె ప్రయాణం ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్తోంది. అయితే ఈ అమ్మడికి అవకాశాలతో పాటు క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. తాజాగా ఆమె అభిమానుల్లో ఒకరు రష్మికను కలవడానికి పెద్ద సాహసమే చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే అభిమాని రష్మిక మందన్నను కలవాలనే కోరికతో 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే అంతకుముందే అతను గూగుల్ లో రష్మిక చిరునామా కోసం సెర్చ్ చేశాడట. ఆ తరువాత ఆకాష్ తెలంగాణ నుండి మైసూర్ రైలులో, కొడగు జిల్లాలోని ముగ్లాకు ఆటో రిక్షాలో చేరుకున్నాడు. అయితే తీరా అక్కడికి వెళ్ళాక తన అభిమాన నటి అడ్రెస్ ను కనుక్కోలేకపోయాడు. దీంతో అక్కడే నివాసం ఉండే వ్యక్తులను అడిగి రష్మిక ఇంటి అడ్రెస్ కోసం ఆరా తీయడం మొదలెట్టాడట. దీంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారట. అక్కడి పోలీసులు ఆ వ్యక్తి వివరాలు కనుక్కుని, ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని తన ఇంట్లో లేదని చెప్పి, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారట. తన అభిమాన నటిని కలవాలని అభిలాషతో అంతదూరం ప్రయాణం చేసి వెళ్లిన అతనికి నిరాశ తప్పలేదు.
Read Also : సోనూసూద్ కు 12 మిలియన్ల ‘అనుసర’ గణం!
Also Read
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
- SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ఈ విషయం కాస్తా రష్మిక దృష్టికి వెళ్లిందట. దీంతో ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. “గైస్ మీలో ఒకరు చాలా దూరం ప్రయాణించి నన్ను చూడటానికి ఇంటికి వెళ్ళారని నా దృష్టికి వచ్చింది. దయచేసి అలాంటిదేమీ చేయకండి. నేను మిమ్మల్ని కలవలేకపోయానని బాధగా ఉంటుంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. కానీ ప్రస్తుతానికి ఇక్కడ (సోషల్ మీడియా) నాపై ప్రేమ చూపించండి. నేను చాలా సంతోషిస్తాను” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా “మిషన్ మజ్ను” చిత్రీకరణ కోసం రష్మిక మండన్న ముంబై లో ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప”, అమితాబ్ బచ్చన్ “గుడ్ బై” చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ కన్నడ భామ.
Guys it just came to my notice that one of you had travelled super far and have gone home to see me..
Please don’t do something like that.. i feel bad that I didn’t get to meet you🥺 I really really hope to meet you one day❤️ but for now show me love here.. I’ll be happy! 🌸🥰— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2021
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!