రష్మిక కోసం 900 కిమీ నడిచిన అభిమానికి నిరాశ… స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్
“ఛలో” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం రష్మిక మందన్న ఆ తరువాత వెనక్కి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకదాని తరువాత ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె ప్రయాణం ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్తోంది. అయితే ఈ అమ్మడికి అవకాశాలతో పాటు క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. తాజాగా ఆమె అభిమానుల్లో ఒకరు రష్మికను కలవడానికి పెద్ద సాహసమే చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే అభిమాని రష్మిక మందన్నను కలవాలనే కోరికతో 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే అంతకుముందే అతను గూగుల్ లో రష్మిక చిరునామా కోసం సెర్చ్ చేశాడట. ఆ తరువాత ఆకాష్ తెలంగాణ నుండి మైసూర్ రైలులో, కొడగు జిల్లాలోని ముగ్లాకు ఆటో రిక్షాలో చేరుకున్నాడు. అయితే తీరా అక్కడికి వెళ్ళాక తన అభిమాన నటి అడ్రెస్ ను కనుక్కోలేకపోయాడు. దీంతో అక్కడే నివాసం ఉండే వ్యక్తులను అడిగి రష్మిక ఇంటి అడ్రెస్ కోసం ఆరా తీయడం మొదలెట్టాడట. దీంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారట. అక్కడి పోలీసులు ఆ వ్యక్తి వివరాలు కనుక్కుని, ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని తన ఇంట్లో లేదని చెప్పి, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారట. తన అభిమాన నటిని కలవాలని అభిలాషతో అంతదూరం ప్రయాణం చేసి వెళ్లిన అతనికి నిరాశ తప్పలేదు.
Read Also : సోనూసూద్ కు 12 మిలియన్ల ‘అనుసర’ గణం!
Also Read
- Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- Dacoit OTT Release Date: అడివి శేష్ 'డెకాయిట్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
- Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
ఈ విషయం కాస్తా రష్మిక దృష్టికి వెళ్లిందట. దీంతో ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. “గైస్ మీలో ఒకరు చాలా దూరం ప్రయాణించి నన్ను చూడటానికి ఇంటికి వెళ్ళారని నా దృష్టికి వచ్చింది. దయచేసి అలాంటిదేమీ చేయకండి. నేను మిమ్మల్ని కలవలేకపోయానని బాధగా ఉంటుంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. కానీ ప్రస్తుతానికి ఇక్కడ (సోషల్ మీడియా) నాపై ప్రేమ చూపించండి. నేను చాలా సంతోషిస్తాను” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా “మిషన్ మజ్ను” చిత్రీకరణ కోసం రష్మిక మండన్న ముంబై లో ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప”, అమితాబ్ బచ్చన్ “గుడ్ బై” చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ కన్నడ భామ.
Guys it just came to my notice that one of you had travelled super far and have gone home to see me..
Please don’t do something like that.. i feel bad that I didn’t get to meet you🥺 I really really hope to meet you one day❤️ but for now show me love here.. I’ll be happy! 🌸🥰— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2021
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!