రష్మిక కోసం 900 కిమీ నడిచిన అభిమానికి నిరాశ… స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఛలో” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం రష్మిక మందన్న ఆ తరువాత వెనక్కి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకదాని తరువాత ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె ప్రయాణం ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్తోంది. అయితే ఈ అమ్మడికి అవకాశాలతో పాటు క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. తాజాగా ఆమె అభిమానుల్లో ఒకరు రష్మికను కలవడానికి పెద్ద సాహసమే చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే అభిమాని రష్మిక మందన్నను కలవాలనే కోరికతో 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే అంతకుముందే అతను గూగుల్ లో రష్మిక చిరునామా కోసం సెర్చ్ చేశాడట. ఆ తరువాత ఆకాష్ తెలంగాణ నుండి మైసూర్ రైలులో, కొడగు జిల్లాలోని ముగ్లాకు ఆటో రిక్షాలో చేరుకున్నాడు. అయితే తీరా అక్కడికి వెళ్ళాక తన అభిమాన నటి అడ్రెస్ ను కనుక్కోలేకపోయాడు. దీంతో అక్కడే నివాసం ఉండే వ్యక్తులను అడిగి రష్మిక ఇంటి అడ్రెస్ కోసం ఆరా తీయడం మొదలెట్టాడట. దీంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారట. అక్కడి పోలీసులు ఆ వ్యక్తి వివరాలు కనుక్కుని, ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని తన ఇంట్లో లేదని చెప్పి, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారట. తన అభిమాన నటిని కలవాలని అభిలాషతో అంతదూరం ప్రయాణం చేసి వెళ్లిన అతనికి నిరాశ తప్పలేదు.
Read Also : సోనూసూద్ కు 12 మిలియన్ల ‘అనుసర’ గణం!
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
ఈ విషయం కాస్తా రష్మిక దృష్టికి వెళ్లిందట. దీంతో ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. “గైస్ మీలో ఒకరు చాలా దూరం ప్రయాణించి నన్ను చూడటానికి ఇంటికి వెళ్ళారని నా దృష్టికి వచ్చింది. దయచేసి అలాంటిదేమీ చేయకండి. నేను మిమ్మల్ని కలవలేకపోయానని బాధగా ఉంటుంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. కానీ ప్రస్తుతానికి ఇక్కడ (సోషల్ మీడియా) నాపై ప్రేమ చూపించండి. నేను చాలా సంతోషిస్తాను” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా “మిషన్ మజ్ను” చిత్రీకరణ కోసం రష్మిక మండన్న ముంబై లో ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప”, అమితాబ్ బచ్చన్ “గుడ్ బై” చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ కన్నడ భామ.
Guys it just came to my notice that one of you had travelled super far and have gone home to see me..
Please don’t do something like that.. i feel bad that I didn’t get to meet you🥺 I really really hope to meet you one day❤️ but for now show me love here.. I’ll be happy! 🌸🥰— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2021
తాజావార్తలు
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!