గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ముంబై వేదికగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఇండస్ట్రీని షేక్ చేయగా.. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్, మోలీవుడ్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రంగంలోకి దిగింది.
తాజాగా ఈ సినిమా సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి ఒక బిగ్గెస్ట్ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ‘థింక్ స్టూడియోస్’ (Think Studios) తమిళనాడు, కేరళ రాష్ట్రాల ‘పెద్ది’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రేజీ డీల్తో తమిళనాడు, కేరళ అంతటా ‘పెద్ది’ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండరీ స్టార్ శివ రాజ్కుమార్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండటం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో ఇప్పటికే తమిళం, మలయాళం బెల్ట్లో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇప్పుడు ‘థింక్ స్టూడియోస్’ లాంటి పెద్ద సంస్థ ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేయడంతో రామ్ చరణ్ కెరీర్లోనే తమిళనాడు, కేరళలో అత్యంత భారీగా విడుదల కాబోతున్న చిత్రంగా ‘పెద్ది’ నిలవనుంది. మరి జూన్ 4న థియేటర్లలో గ్లోబల్ వైడ్గా రిలీజ్ కాబోతున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ ఎపిక్.. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద కూడా ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.
