పోలీసులపై రాజమౌళి షార్ట్ ఫిల్మ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నాడు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పుడు ఆ సేవలను మరోరకంగా విస్తరించబోతున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసులపై రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాడట. దీని నిడివి 19 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపకల్పన విషయమై ఇటీవల రాజమౌళి సైబరాబాద్ సి.పి. సజ్జనార్, హైదరాబాద్ సి.పి. అంజనీ కుమార్, రాచకొండ సి. పి. మహేశ్ భగవత్ లతో చర్చలు జరిపారట. వారందరి నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో రాజమౌళి షార్ట్ ఫిల్మ్ నిర్మాణంపై ముందడుగు వేశారట. ఈ లఘు చిత్రం ద్వారా రాజమౌళి పోలీసుల ప్రాధాన్యం, కరోనా సమయంలో సమాజానికి వారు చేస్తున్న సేవ గురించి చక్కని, బలమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారట. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీని తెరకెక్కిస్తున్న రాజమౌళి అది పూర్తి కాగానే మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని అంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!