Vijay Sethupathi: పూరితో విజయేంద్ర ప్రసాద్.. ఇదెక్కడి మాస్ మావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
Also Read:samyuktha : మలయాళ కుట్టీకి పెరుగుతున్న డిమాండ్..
మే 30, 2025న పూరీ జగన్నాధ్, విజయేంద్ర ప్రసాద్తో సమావేశమైన ఫోటోలను పూరీ కనెక్ట్స్ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో పూరీ జగన్నాధ్, చార్మీ కౌర్, విజయేంద్ర ప్రసాద్ కలిసి కనిపించారు. ఈ భేటీ విజయ్ సేతుపతి నటిస్తున్న రాబోయే చిత్రం ‘బెగ్గర్’కు సంబంధించిన చర్చల కోసం జరిగినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ను పూరీ జగన్నాధ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read
- AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
Also Read:Kamal: నాకన్నా నలుగురు బెస్ట్ యాక్టర్స్ దొరికినపుడు నటన ఆపేస్తా!
గతంలో పూరీ జగన్నాధ్పై అభిమానంతో ఆయన తన తదుపరి సినిమా కథను తనతో షేర్ చేయాలని విజయేంద్ర ప్రసాద్ స్వయంగా కాల్ చేసి అడిగిన సంగతి తెలిసిందే. ‘లైగర్’ సినిమా విఫలమైన తర్వాత, విజయేంద్ర ప్రసాద్ పూరీకి మద్దతుగా నిలిచారు. గత సంఘటనను గుర్తు చేస్తూ, ప్రస్తుత భేటీ కూడా విజయ్ సేతుపతి సినిమా కథ గురించి చర్చించడానికే జరిగి ఉంటుందని అభిమానులు, సినీ విశ్లేషకులు ఊహిస్తున్నారు. పూరీ జగన్నాధ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం ఒక హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో టబు, రాధిక ఆప్టే, దునియా విజయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను పూరీ కనెక్ట్స్ బ్యానర్పై గ్రాండ్గా నిర్మిస్తున్నారు, మరియు ఇది తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్లో భాగమైతే, ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో మరో బ్లాక్బస్టర్గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ జూన్లో ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!