Dil Raju: తిరుమల శ్రీవారి కోసం ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ ధాన్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుకు తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే అపార నమ్మకం. అందుకే తన స్వగ్రామంలో ఆయన వేంకటేశ్వరస్వామి కోవెలను నిర్మించారు. అలానే తాను నిర్మించిన ప్రతి చిత్రం విడుదల కాగానే తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించి, స్వామిని దర్శించుకుని రావడమన్నది ‘దిల్’ రాజు కు కొన్నేళ్ళుగా ఉన్న అలవాటు. తాజాగా ఆయన అన్న నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం కూడా మొదలు పెట్టారు. ఇలా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యాన్ని ‘మా పల్లె ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం ఆరగింపు సేవ కోసం అందిస్తున్నారు.
దీనికి సంబంధించిన వివరాలను ‘దిల్’ రాజు శనివారం మీడియాకు వివరించారు. ‘ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పదకొండు రకాల వరి ధాన్యం నుంచి పంచభక్ష్యాలుగా, నారాయణ కామిని, కృష్ణ వ్రీహి, బహురూపి, రత్న చోడి, ఘని అనే ఐదు రకాల ధాన్యాన్ని తిరుమలకు పంపుతున్నామ’ని దిల్ రాజు తెలిపారు. ‘ఇందులో భాగస్వాములు కావాలనుకున్న కొందరు స్వామి భక్తులు పది కేజీల చొప్పన ధాన్యం తీసుకుని వారి ఇంటిలోని పూజా గదిలో స్వామి చెంత ఉంచి మే 1న తిరిగి ఇందురూ తిరుమల దేవస్థానంలో సమర్పించాల’ని అన్నారు. అలా సేకరించిన మొత్తం ధాన్యాన్ని మే1న స్వామి నామ సంకీర్తనతో మేళతాళాలతో, ఊరేగింపుతో ప్రత్యేక వాహనంలో తిరుమలకు పంపుతామని వివరించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని మా పల్లె ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ బృందం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దిల్ రాజు సోదరుడు నరసింహారెడ్డి, శిరీష్ తో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, ఇంద్రగంటి మోహన కృష్ణ, ‘మ్యాంగో’ రామ్, హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
-
Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!