The Raja Saab: అర్ధరాత్రి జీవో.. తెలంగాణలో భారీగా పెరిగిన రాజా సాబ్ టికెట్ రేట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి శుక్రవారం నాడు ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అయితే, గురువారం రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు, శుక్రవారం నుంచి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరారు. అయితే ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు, అంటే ఆదివారం వరకు మూడు రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 105, మల్టీప్లెక్స్లలో 132 రూపాయలు పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు.
Also Read :The Raja Saab Part 2: రాజా సాబ్ 2కి టైటిల్ ఇదే!
Also Read
అలాగే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లో 62, మల్టీప్లెక్స్లో 89 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక టికెట్లు పెంచి అమ్మిన నేపథ్యంలో వచ్చే లాభంలో 20% ఫిలిం ఫెడరేషన్కు ఇవ్వాలని ఆ ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది. మారుతి దర్శకత్వంలో హారర్ ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందించబడిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ప్రభాస్ సరసన హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
T20 World Cup: ‘కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి’.. ఇండియన్ ప్లేయర్ కళ్లలో మెరిసిన భావోద్వేగపు సంతకం..
-
Shankh Mitra: ఎలాన్ మస్క్కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?