పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నా వరుస చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ క్రేజీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లారు దర్శకుడు మారుతి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ‘ది రాజా సాబ్’ మూవీ అప్డేట్ కోసం రిక్వెస్ట్ చేయగా.. సమాధానం ఇస్తూ షూటింగ్ అప్డేట్ అలాగే రిలీజ్ డేట్ పై కూడా డైరెక్టర్ మారుతి మాట్లాడారు.
Also Read: Salim Akhtar : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మృతి..
‘ ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్తో చేస్తున్నాం. కొంత డబ్బింగ్ పార్ట్, సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వివిధ కంపెనీలు సీజీ వర్క్స్ చేస్తున్నాయి. వాటి నుంచి వచ్చే ఔట్పుట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాం. సినిమా అంటే సమిష్టి కృషి. ఒక్కరు నిర్ణయం తీసుకునేది కాదు. ఇందులో ఎంతోమంది శ్రమ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకే అనుకున్న టైమ్కు కొంత ఆలస్యమవుతోంది. సీజీ వర్క్స్ కంప్లీట్ అయితే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఈ సినిమా కోసం మేము పడిన కష్టాన్ని, మా ప్యాషన్ను వీలైనంత త్వరగా మీకు చూపించాలని కోరుకుంటున్నాం’ అని తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.