Kingdom : ఏపీలో కింగ్డమ్ టికెట్ రేట్లు హైక్.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
Also Read : HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..
Also Read
తాజాగా ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో లెక్కల ప్రకారం ఈ సినిమాకి సంబంధించి సింగిల్ స్క్రీన్లో జీఎస్టీతో కలిపి 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో జీఎస్టీతో కలిపి 75 రూపాయలు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించారు.
Also Read : Abbas : తిరిగి రావడానికి సిద్ధమైన ‘లవర్ బాయ్’ అబ్బాస్!
సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి సంబంధించి తెలంగాణలో కూడా టికెట్ రేట్స్ హైక్ అడిగే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 130 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా రూపొందించారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా 50 కోట్లు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో
-
Sai Pallavi: ‘రామాయణ’ టీమ్పై సాయిపల్లవి ఫ్యాన్స్ ఫైర్!
-
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
-
Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
-
Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!