Niharika Konidela: డిస్ట్రిబ్యూటర్ల ఆనందమే అసలైన విజయం.. ప్రతీ ఒక్కరికీ థాంక్స్!
- నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం రాకాస
- ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన రాకాస
- డిస్ట్రిబ్యూటర్లతో ఘనంగా సక్సెస్ మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఈరోజు ఘనంగా సక్సెస్ మీట్ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పడం అసాధ్యం. కానీ మీ ప్రేమకు నేను రుణపడి ఉంటాను. సినిమాను నమ్మి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లందరూ ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. అదే నా నిజమైన విజయం. భవిష్యత్తులో నేను చేసే ప్రతి సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు ఇలాగే సంతోషంగా ఉండేలా చూసుకుంటాను’ అని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమలో తనకు అండగా నిలిచిన వారిని ఈ సందర్భంగా నిహారిక గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా మైత్రి రవి గారి గైడెన్స్, స్ట్రైక్ సమయంలో సపోర్ట్ చేసిన సుప్రియ, స్వప్న దత్ సహాయాన్ని కొనియాడారు. సినిమా ఇంతటి విజయం సాధించడంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పిల్లర్ అయిన రమేష్ గారి పాత్ర ఎంతో ఉందని ఆమె తెలిపారు.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
సినిమా విజయంలో భాగస్వాములైన సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీనుల నటనను నిహారిక అభినందించారు. ప్రమోషన్స్ విషయంలో ఎవరూ ఎటువంటి షరతులు విధించకుండా పూర్తి స్థాయిలో సహకరించడం వల్లే ‘రాకాస’ ప్రేక్షకులకు అంత దగ్గరైందని ఆమె అన్నారు. దర్శకురాలు మానస శర్మ ఈ చిత్రాన్ని సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. సక్సెస్ మీట్లో నిహారిక ఒక కీలక ప్రకటన చేశారు. రాకాసను మరింత మంది ప్రేక్షకులకు చూడాలనే ఉద్దేశంతో.. నేటి నుంచి సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను కేవలం రూ.100 కే అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ థియేటర్లకు వచ్చి ఈ ఎంటర్టైనర్ను ఎంజాయ్ చేయాలని నిహారిక కోరారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..