Pushpa 2: మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్
- మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్
- నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకమైనది
- సపోర్ట్ అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక రోజు ముందుగానే దీనికి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇక ఈ ప్రీమియర్ షోస్ లో ఒక దానికి అల్లు అర్జున్ హాజరయ్యాడు. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఒక తొక్కిసలాట ఏర్పడింది. హీరో రావడంతో జనం భారీ ఎత్తున ఆయనను కలిసేందుకు కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు అల్లు అర్జున్ కానీ సినిమా నిర్మాణ సంస్థ కానీ స్పందించలేదు.
Honey Rose: బాలయ్యతో కయ్యానికి సిద్దమైన హనీ రోజ్!!
Also Read
తాజాగా విమర్శల నేపద్యంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ విషయం మీద సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకమైనదని, తాము చాలా బాధపడుతున్నామని పేర్కొన్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆ బాలుడి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం, ఆ బాలుడు గురించే ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ సపోర్ట్ అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ మీద నిర్మాతల మీద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
We are extremely heartbroken by the tragic incident during last night’s screening. Our thoughts and prayers are with the family and the young child undergoing medical treatment.
We are committed to standing by them and extending all possible support during this difficult time.…
— Mythri Movie Makers (@MythriOfficial) December 5, 2024
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!