Ms India : మిసెస్ ఇండియా’ పోటీలో సత్తా చాటిన తెలంగాణ వనిత సుష్మా
- మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన సుష్మా
- భారతదేశంలో యూఎంబీ ప్యాజెంట్ అందాల పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిసెస్ ఇండియా మై ఐడెంటిటీకి జరిగిన పోటీల్లో గతంలోనే సత్తా చాటారు సుష్మా తోడేటి. పెళ్లి అయ్యాక మహిళల జీవితం వంటింటికే పరిమితం కాదని, పెళ్లైనా, సంసార జీవితాన్ని సాగిస్తూ ఎన్నో శిఖరాలను అధిరోహించొచ్చని ఎంతో మంది నిరూపిస్తున్నారు. అలాంటి ధీర వనితల్లో సుష్మా తోడేటి ఒకరు. మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొని మన ఆచార, సంప్రదాయాలను చాటి చెప్పారు. గతంలో జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మా తోడేటి పలు కేటగిరీల్లో అవార్డులు సాధించారు. బెస్ట్ కల్చర్ డ్రెస్, మిసెస్ వెల్ స్పోకెన్, సోషల్ ఇన్స్టిట్యూట్ వంటి కేటగిరీల్లో టాప్లో నిలిచారు సుష్మా. రీసెంట్గా యూఎంబీ ప్యాజెంట్ మిసెస్ ఇండియా పోటీలు జరిగాయి. ఇందులోనూ సుష్మా తోడేటి తన సత్తా చాటారు. థర్డ్ రన్నరప్గా నిలిచారు.
Also Read : Tollywood : ఘనంగా ప్రారంభమైన ‘మహా సంద్రం’
Also Read
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
కుటుంబమే తన బలం తన భర్త శ్రీనాథ్ వెన్నంటి ప్రోత్సహించడం వల్లే ఈ స్థాయిలో రాణించగలుగుతున్నానని అన్నారు సుష్మా తోడేటి. ప్రపంచ వేదికలపై తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడం చెప్పలేని అనుభూతిని కల్గిస్తుందని అన్నారు. తెలంగాణ చేనేతను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని సుష్మా తోడేటి చెబుతున్నారు. భారతదేశంలో యూఎంబీ ప్యాజెంట్ అందాల పోటీకి ఉండే క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సారి వివిధ రాష్ట్రాల నుంచి స్పూర్తిదాయకమైన 70 మంది పోటీదారులను స్వాగతించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఉర్మి, స్నిగ్ధా బారుహ్ స్థాపించిన UMB ప్యాజెంట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ పొందింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, మానుషి చిల్లర్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా, కరిష్మా కపూర్, మలైకా అరోరా ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!