Mahesh-Prashanth Neel: మహేశ్, ప్రశాంత్ నీల్.. మధ్యలో లోకేశ్ కనకరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అంటే కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే చెప్పాలి. ఈ సినిమాతో కమల్ అప్పులన్నీ తీరిపోవడమే కాదు దశాబ్దం తర్వాత హిట్ కొట్టాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ అనే చెప్పాలి. తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను విజయతీరాలకు తీర్చింది లోకేశ్ అయితే అందులో పాత్రలకు ప్రాణం పోసింది కమల్ హాసన్, విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత పలువురు సినీ ప్రముఖులు సినిమా గురించి, కమల్ గురించి ట్వీట్ చేసి అభినందించారు. తాజాగా మహేశ్ బాబు ట్వీట్ సోషల్ మీడియాలో హైలైట్ అయింది. మహేశ్ తన ట్వీట్ లో కమల్ తో పాటు దర్శకుడు లోకేశ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ‘విక్రమ్’ కంటే ముందు విడుదలైన సంచలన విజయం సాధించిన ‘కెజిఎఫ్2’ గురించి కానీ, దాని దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి కానీ మహేశ్ ట్వీట్ చేయకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
read also: Alluri Sitarama Raju: భీమవరంలో అల్లూరి విగ్రహం ప్రత్యేకతలు తెలుసా?
Also Read
- Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
- Anirudh : అనిరుథ్ - కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
మహేశ్ ‘కెజిఎఫ్2’ని లైట్ గా తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉందంటున్నారు. నిజానికి ‘కెజిఎఫ్’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాగానే ప్రశాంత్ నీల్ ని అభినందించింది మహేశ్ బాబే. అంతే కాదు తనతో తన తదుపరి సినిమా కూడా చేయాలనుకున్నాడు. అలాగే ఎన్టీఆర్, ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ తో చిత్రాలు చేయాలని భావించారు. ఎన్టీఆర్ తరపున మైత్రీమూవీ మేకర్స్, ప్రభాస్ తరపున వంశీ, ప్రమోద్ ప్రశాంత్ నీల్ ని కలిశారు. అయితే ఏమైందో ఏమో కానీ మహేశ్ తో సినిమా వర్కవుట్ కాలేదు. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రకటనలు వచ్చేశాయి. మహేశ్ తో సినిమా అంటే పారితోషికంతో పాటు పార్టనర్ షిప్ తదితర అంశాలు భాగంగా ఉంటాయి. ఈ విషయంలో ఎలాంటి పట్టువిడుపు ఉండవు. అందుకే మహేశ్ తో ప్రశాంత్ నీల్ సినిమా వర్కవుట్ అయి ఉండదని ఇండస్ట్రీ వర్గాల అంతర్గత వర్గాల మాట. దీంతో మహేశ్ బాబు బాగా హర్ట్ అయినట్లు సమాచారం. అందుకే ‘కెజిఎఫ్ 2’ అంతటి ఘన విజయం సాధించినా మహేశ్ బాబు స్పందించకపోవటానికి కారణమని వినికిడి. కానీ చిత్రపరిశ్రమలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఎప్పటికైనా మహేశ్ బాబు, ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా రావచ్చు. మహేశ్ ఫ్యాన్స్ కూడా వీరి కాంబినేషన్ లో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’, ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. మరి మహేశ్ తో సినిమా ఎప్పుడన్నది కాలమే నిర్ణయించాలి. ఈలోగా మహేశ్, లోకేశ్ సినిమా రావచ్చేమో! లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Aman Sanger: భారతీయ కుర్రాడి సత్తా.. నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల యువకుడి స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!