Keerthy Suresh : హీరోలతో సమానంగా మాకు రెమ్యూనరేషన్.. ఇవ్వాలి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్రాలతో తన కెరీర్ను ప్రారంభించిన ఈ అందాల భామ కీర్తి సురేష్.. తక్కువ సమయంలోనే దక్షిణ భారత సినీ పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన రాగా. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సుహాస్ కాటికాపరి పాత్రలో, కీర్తి గ్రామాధికారిణిగా ఈ సినిమాలో కనిపించనుంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో నిమగ్నమైంది కీర్తి.
Also Read : Rashmika : అలాంటి పాత్రలు చేయను.. నేషనల్ క్రష్ స్ట్రాంగ్ స్టేట్మెంట్
Also Read
ఈ సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.. ‘నా విషయంలో పారితోషికాన్నికి చివరి ప్రాధాన్యత ఇస్తాను. మొదట కథే నాకు చాలా ముఖ్యం. వైవిధ్యమైన పాత్రలు పోషించడమే నా లక్ష్యం. హీరోహీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ విషయం పై చర్చలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఒక హీరో కోసం ప్రేక్షకులు ఎలా అయితే థియేటర్ కు వస్తున్నారో, అదే స్థాయిలో ఓ హీరోయిన్ కోసం కూడా ప్రేక్షకులు వస్తుంటే కచ్చితంగా నాయికకు హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వొచ్చు’ అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
-
Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’