తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ మరోసారి నటుడు కార్తీతో కలిసి ఖైదీ 2 చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తాజా సమాచారం సూచిస్తోంది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా భారీ విజయం సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా కార్తీ ఆయనను కలిసి, ఒక కడియం బహుమతిగా ఇచ్చారు.
Sridevi : ‘కోర్టు’ మూవీ హీరోయిన్ జాబిలి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
ఈ సమయంలో ఖైదీ 2 ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చని హింట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ హింట్తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఖైదీలో కార్తీ తన పవర్ఫుల్ నటనతో ప్రశంసలు అందుకున్నారు, లోకేష్ కూడా తనదైన యాక్షన్ శైలితో సినిమాను హిట్ చేశారు. మాస్టర్, విక్రమ్, లియో వంటి హిట్ చిత్రాలతో లోకేష్ తన సత్తా చాటారు. ఖైదీ 2 కూడా మొదటి భాగంలాగే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని అంచనాలు ఉన్నాయి. కథ, నటీనటులు, విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కొత్త ప్రాజెక్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
DILLI RETURNS
Let it be another fantastic year @Dir_Lokesh@DreamWarriorpic @KvnProductions pic.twitter.com/sLLkQzT0re
— Karthi (@Karthi_Offl) March 15, 2025