Manchu Vishnu: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత మాయం చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందే ఊహించని సమస్యల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన హార్డ్ డ్రైవ్ మాయమైన వ్యవహారం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి పంపిన హార్డ్ డ్రైవ్ ఆఫీస్ బాయ్ రఘు ద్వారా చరిత అనే యువతికి అప్పగించబడింది. అయితే, ఆ తర్వాత చరిత కనిపించకుండా పోయింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు, చరితలు సినిమాకు నష్టం కలిగించే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:RCB: ఆర్సీబీ టైటిల్ గెలిస్తే.. జూన్ 4న పబ్లిక్ హాలిడే ?
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
తాజాగా చెన్నైలో జరిగిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్లో కూడా విష్ణు ఈ ఘటనను ప్రస్తావించారు. “మా టీమ్ ఎంతో కష్టపడి ఈ సినిమాను ఒక ల్యాండ్మార్క్గా తీర్చిదిద్దింది. ఇలాంటి కుట్రలు మమ్మల్ని ఆపలేవు. ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన పైరేటెడ్ కంటెంట్ను వినోదం కోసం ప్రసారం చేయవద్దని కోరుతున్నాను” అని విజ్ఞప్తి చేశారు. ఈ హార్డ్ డ్రైవ్ మాయం వెనుక మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ హస్తం ఉందని విష్ణు ఆరోపిస్తున్నారు. రఘు, మనోజ్కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడని, చరిత కూడా మనోజ్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి అని చెన్నైలో పేర్కొన్నారు. 45 రోజుల క్రితం హైవ్ స్టూడియోస్ నుంచి వచ్చిన హార్డ్ డ్రైవ్ పార్శిల్ను విష్ణు ఇంటి సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ సిబ్బంది అడ్డుకున్నారని, ఈ ఘటన వెనుక మనోజ్ కుటుంబం నుంచి కావాలనే కుట్ర జరిగిందని విష్ణు టీమ్ ఆరోపణలు చేస్తోంది. విష్ణు-మనోజ్ మధ్య చాలా కాలంగా కుటుంబ వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఆ వివాదాలు మరింత ముదిరాయని అనిపిస్తోంది. అయితే, మనోజ్ మద్దతుదారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. “మనోజ్ ‘భైరవం’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి కుట్రలకు సమయం ఎక్కడిది?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Police Complaint : ‘పోలీస్ కంప్లెయింట్’ ఇస్తానంటున్న వరలక్ష్మి శరత్ కుమార్
ఎవరి ప్రోత్సాహంతో?
రఘు, చరితలు సొంతంగా ఈ చర్యకు పాల్పడ్డారా లేక ఎవరి ప్రోత్సాహంతోనైనా ఈ పని చేశారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. విష్ణు వర్గం ఈ ఘటనను “సినిమా విడుదలను అడ్డుకోవడానికి, కంటెంట్ లీక్ చేయడానికి చేసిన కుట్ర”గా చెబుతుండగా మనోజ్ నుంచి ఇంతవరకు స్పందన రాకపోవడం సందేహాలను మరింత రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!