తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్. వన్ ఫైన్ డే ఫ్యాన్స్కు బిగ్ షాకిచ్చాడు. యాక్టింగ్కు పర్మినెంట్ గుడ్ బై చెప్పేసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అని ఎనౌన్స్ చేశాడు. జననయగన్ సినిమా తర్వా పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతానని స్పష్టం చేసాడు. విజయ్ లోటు ఎవరు భర్తీ చేస్తారు అని బెంగ పెట్టుకున్న టైంలో నేనున్నాను అంటూ వచ్చాడు దళపతి వారసుడు జాసన్ సంజయ్. అయితే మా నాన్నలా నాపై హోప్స్ పెట్టుకోకండి నేను చేసేది యాక్టింగ్ కాదు డైరెక్షన్ అని క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Samantha : రాజ్ తో కలిసి ‘కొత్త ప్రారంభం’.. సమంత పోస్ట్ వైరల్
టోర్నడాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పీరియన్స్తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ మూవీలో తెలుగు హీరో సందీప్ కిషన్ను హీరోగా ఎంచుకున్నాడు. రీసెంట్లీ సందీప్ బర్త్ డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. బడా చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి.. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు మేకర్స్. ప్రజెంట్ జాసన్ పూర్తిగా దర్శకత్వంపైనే కాన్సట్రేషన్ చేస్తున్నాడు. క్లిక్ అయితే ఓకే కానీ దర్శకుడిగా బిగ్ ఫ్యాన్ బేస్ సంపాదించడం కష్టమే. అలాగే హీరో అయిపోతే సరిపోదు.. ప్రేక్షకుల మెచ్చే హీరో కావాల్సి ఉంటుంది. అప్పుడే తండ్రి చరిష్మాను రిపీట్ చేయగలడు. ప్రస్తుతం డైరెక్షన్కే ఇంపార్టెన్స్ ఇస్తోన్న జానన్ ఫ్యూచర్లో హీరో అవుతాడేమో చూడాలి.