కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ ‘సురులి’ అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ఈ తమిళ చిత్రం జూన్ 18న ప్రముఖ ఓటిటి వేదిక నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వబోతోంది. తెలుగులో ‘జగమే తంత్రం’గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఓటిటిలో భారీ రేంజ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ లో దాదాపు 190 దేశాల్లో, 17 భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుండడం విశేషం. ఇటీవల ధనుష్ నటించిన “కర్ణన్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా విడుదల కానున్న “జగమే తందిరం” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.