Madras High Court Shocks to Director Gautham Menon: మణితర్నం తర్వాత క్లాసికల్ లవ్ స్టోరీలతో పాపులరైన గౌతమ్ వాసు దేవ్ మీనన్ లైఫ్లో బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. చియాన్ విక్రమ్తో తీసిన సినిమా ‘థ్రువ నక్షత్రం’ రిలీజ్ పెండింగ్లో ఉండగా.. తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక మెగా ఫోన్కు కాస్త గ్యాప్ ఇచ్చి యాక్టింగ్ వైపు యూటర్న్ తీసుకున్నాడు. ఆయన కీ రోల్ చేసిన ‘కార్మెనీ సెల్వం’ రిలీజ్ అవుతున్న సమయంలో గౌతమ్ మీనన్కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
2008 నాటి కేసు తాజాగా గౌతమ్ మీనన్ మెడకు చుట్టుకుంది. తన నిర్మాణ సంస్థ ఫోటాన్ ఫ్యాక్టరీ, ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్తో కలిసి గతంలో ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ సంస్థ నుంచి 4. 25 కోట్లు విడతల వారిగా తీసుకున్నారు. 2009లో మూవీ కంప్లీట్ చేయాల్సి ఉండగా.. అసలు మొదలే కాలేదు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోడంతో ఆర్ఎస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఈ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. సవాల్ చేస్తూ గౌతమ్ మీనన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అలాగే డబ్బులు ఎగ్గొట్టేందుకు కోర్టుకు కట్టు కథలు కూడా చెప్పాడు.
Also Read: Sharwanand Sentiment: శర్వానంద్కు మరో సెంటిమెంట్ యాడయ్యిందా?.. చెప్పి మరీ హిట్ కొడుతున్నాడా?
ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ ఆర్ఎస్ న్ఫోటైన్మెంట్ సంస్థ కేటాయించకపోయినా.. తాము నీతానే ఎన్ పొన్ వసంతం/ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాన్ని రూపొందించామని గౌతమ్ మీనన్ మద్రాస్ కోర్టుకు తెలిపాడు. అయితే ఈ బొమ్మ వేరే ఒప్పందం కింద నిర్మించారని తెలుసుకున్న కోర్టు.. చీవాట్లు పెట్టింది. అంతేకాదు ఆర్ఎస్ సంస్థ చెల్లించిన డబ్బుతో పాటు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో గౌతమ్ మీనన్కు భారీ షాక్ తగిలినట్లయింది.