Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేపర్ లీకేజీలు రద్దు చేసి, పారదర్శకమైన విద్యావ్యవస్థను అందించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతగానో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం అనుకోకుండా హింసాత్మక మలుపు తిరగడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు సమాజం నుంచి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ వ్యహారంపై స్పందిస్తూ ‘ పేపర్ లీక్ అనేది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే అత్యంత తీవ్రమైన అంశం. దేశంలోని యువత అంతా కలిసికట్టుగా మెరుగైన విద్యావ్యవస్థ కోసం గళం విప్పడం, వారికి తల్లిదండ్రులు సైతం అండగా నిలవడం గొప్ప పరిణామం. చదువుపై ఎంతో అంకితభావం, నిజాయితీ, భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యంతో ఉన్న ఈ తరం యువత చూపిస్తున్న చొరవ అభినందనీయం. శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతూ తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ధైర్యవంతులైన విద్యార్థులే రేపటి భారతదేశానికి గర్వకారణంగా మారనున్నారు.
Also Read
- The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
- Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
- Sigma Release Date: సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ అనౌన్స్ .. విజయ్ తనయుడి డైరెక్షన్ మూవీ ఎప్పుడంటే?
- Shiva Nirvana: మాకు ముందే తెలుసు.. 'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు.!
ఈ సమస్య కేవలం విద్యార్థులకు, విద్యావ్యవస్థకు మధ్య ఉన్నది మాత్రమే. ఈ ఉద్యమ క్రెడిట్ అంతా విద్యార్థులకే చెందుతుంది తప్ప, దీనిని ఏ రాజకీయ పార్టీలు కూడా తమ ప్రయోజనాల కోసం స్వార్థంతో వాడుకోకూడదు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోవాలి. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడం ద్వారా ఇటు విద్యార్థులకు, అటు దేశానికి ఎంతగానో మేలు జరుగుతుంది.
ఈ క్రమంలో చదువుకు సమాజంలో అత్యంత ప్రాధాన్యత పెరగాలి. ఏటా చదువు అనేది ఒక ట్రెండ్గా, గర్వకారణమైన అంశంగా మారాలి. ఎంతలా అంటే, విదేశాల నుంచి కూడా విద్యార్థులు మన దేశానికి వచ్చి చదువుకునే స్థాయికి భారతదేశం ఒక అంతర్జాతీయ ‘ఎడ్యుకేషనల్ హబ్’గా రూపాంతరం చెందాలి. ఉన్నతమైన ఆశయంతో చదువుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం, సరైన అవకాశాలు దక్కాలని ఆశిద్దాం’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.
It was such a peaceful movement, feel so sad that it had to take a violent turn. My heart goes out to the students and their families who were hurt. Paper leak is a very serious issue, and I am glad to know n see that the kids of our country have come together for a better…
— Salman Khan (@BeingSalmanKhan) July 22, 2026
- Tags
తాజావార్తలు
-
AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
-
Kailash Mystery: కైలాస పర్వతంపై శివుడు ఇప్పటికీ ఉన్నాడా? అసలు ఈ పర్వతాన్ని ఎందుకు ఎవరూ అధిరోహించలేకపోయారు?
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
-
Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
ట్రెండింగ్
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!