మ్యాచో స్టార్ గోపీచంద్.. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా పాత్ర ఏదైనా సరే పర్ఫెక్ట్ గా పండించగల నటుడు. కానీ ఏమి ఉపయోగం. ఒక సినిమా హిట్ అయితే వరుసగా అరడజనుప్లాపులు ఇస్తున్నాడు గోపీచంద్. ఆ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా ఈ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ్గా నిలిచింది. దాంతో ఇక సినిమాలకు కాస్తా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో కథలు విని తన నెక్ట్స్ సినిమాలను అనౌన్స్ చేసాడు. ఇప్పటికే ఘాజీ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమాను ప్రకటించాడు గోపీచంద్.
Also Read : Karan Johar : ధర్మ ప్రొడక్షన్ హౌజ్లో రెండవసారి ఛాన్స్ కొట్టిన యంగ్ హీరో
తాజాగా మరో సినిమాను ప్రకటించాడు గోపిచంద్. ఈ సారి కాంబినేషన్స్ కాకుండా కథపై ద్రుష్టి పెట్టాడు గోపీచంద్. నూతన దర్శకుడు కుమార్ వెల్లంకి డైరెక్షన్లో గోపీచంద్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర బ్యానర్పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గాండీవదారి అర్జున, జాక్ తో వరుస ప్లాప్స్ అందించారు బివిఎస్ఎన్ ప్రసాద్. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. షామ్దత్ సినిమాటోగ్రఫీ అందించబోతున్న ఈ సినిమాతో అటు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు ఇటు గోపిచంద్ కు సాలీడ్ హిట్ వస్తుందని యూనిట్ భావిస్తోంది. వరుస ప్లాప్స్ కొడుతున్న హీరో వరుస డిజాస్టర్ట్స్ ఇస్తున్న నిర్మాణ సంస్థ కలసి చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు ఫలితం రాబడుతుందో చూడాలి.