హీరోయిన్ రంగుపై ట్రోలింగ్… పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్రసీమకు చెందిన సెలబ్రిటీలు నిత్యం అభిమానులతో, ఫాలోవర్స్ తో టచ్ లో ఉండడానికి సులభమైన మార్గం సోషల్ మీడియా. కానీ దీని ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతకన్నా ఎక్కువగా చెడు కూడా జరుగుతోంది. తాజాగా ఓ టెలివిజన్ నటికి చేదు అనుభవం ఎదురైంది. షాకింగ్ విషయం ఏమిటంటే… ఆమె స్కిన్ కలర్ పై ఈ ట్రోలింగ్ జరగడం. బెంగాలీ బుల్లితెర హీరోయిన్ శృతి దాస్ “త్రినయని” అనే బెంగాలీ సీరియల్ ద్వారా 2019లో టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయమైంది. అప్పటి నుంచి ఈ అమ్మడిపై ట్రోలింగ్ మొదలైంది. కానీ ఇంతకాలం ఆమె ట్రోలింగ్ ను పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తూ వచ్చింది. కానీ ట్రోలర్స్ ఆమెను మరి ఎక్కువగా పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారట. దీంతో ఓపిక నశించిన శృతి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. చివరకు ట్రోల్స్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు సమాచారం.
Read Also : ‘బీస్ట్’తో జానీ మాస్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
Also Read
ఈ విషయంపై శృతి స్పందిస్తూ “నా చుట్టూ ఉన్నవారంతా ట్రోలింగ్ ను పెద్దగా పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. కానీ అవి సమయంతో పాటు రోజురోజుకూ విషపూరితంగా మారిపోతున్నాయి. న ఫస్ట్ టీవీ సీరియల్ “త్రినయని” దర్శకుడితో నేను రిలేషన్షిప్ లో ఉన్నాను. ఈ విషయం తెలిసిన తరువాత నా క్యారెక్టర్, ప్రతిభను ప్రశ్నిస్తూ ద్వేషపూరిత, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే వారికి ఇలాంటి కామెంట్స్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. తనపై వస్తున్న అసభ్యకరమైన ట్రోలింగ్ లను జతచేస్తూ శృతి కోల్కతా పోలీసులను ఫేస్బుక్లో ట్యాగ్ చేసింది. పరిశ్రమలో చాలా మంది తన చర్మం రంగును చర్చనీయాంశంగా మార్చారని, సరైన మేకప్ వేసుకోకపోతే తనకు మళ్లీ నటించే అవకాశం లేదని శృతి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ 25 ఏళ్ల బ్యూటీ “దేశేర్ మాతి” అనే సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
తాజావార్తలు
-
Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
-
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!