మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. ఇక ప్రజంట్ 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాపీల్తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నారు. విశ్వంభర (డైరెక్టర్ వశిష్ఠ), మన శంకర వరప్రసాద్ గారు (డైరెక్టర్ అనిల్ రావిపూడి)తో ఇప్పటికే అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక ఇప్పుడు, మరో భారీ ప్రాజెక్ట్ను డైరెక్టర్ బాబీ తో లైన్లో పెట్టారు. ఇది చిరంజీవి 158 వ సినిమాగా రూపొందనున్నది. టాక్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్గా..
Also Read : Deepika Padukone : ఆ డైరెక్టర్ని అన్ ఫాలో చేసిన దీపిక పదుకొణె..
అనుష్క శెట్టిని తీసుకోవాలని నిర్ణయించారట. అనుష్క కూడా ఈ ఆఫర్పై పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారని తెలిసింది. చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేయాలని అనుష్క చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఆమె గతంలో మీడియా ముందు కూడా “చిరంజీవితో నటించాలన్న కోరిక ఉంది” అని చెప్పింది.
తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి టాప్ హీరోయిన్గా కొనసాగిన అనుష్క చిరంజీవితో మాత్రం నటించలేదు. ఈ కాంబినేషన్ నిజమైతే అభిమానులకు పండగే అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రిలీజ్ అయిన పోస్టర్లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తంతో నిండిన బ్యాక్గ్రౌండ్ చూపించబడింది. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఊరమాస్ గెటప్లో చూపించిన బాబీ.. ఈసారి ఏం ప్లాన్ చేశాడోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పాత్ర డిజైన్లోనే కాదు క్యాస్టింగ్ విషయంలోనూ బాబీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతే కాదు తాజాగా ‘మిరాయ్’ తో విలన్ గా అదరగొట్టిన మనోజ్ ఈ చిత్రంలో విలన్గా తీసుకోనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.