Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- టీఎంసీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం
- అన్ని కమిటీలు, అనుబంధ సంస్థలను రద్దు చేసిన మమత
- పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా మార్చనున్న టీఎంసీ
- అంతర్గత తిరుగుబాటు నేపథ్యంలో కీలక నిర్ణయం
- 16 అనుబంధ సంస్థలపై ఒకేసారి వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో ఉంది. పార్టీ సుప్రీమో మమతా బెనర్జీ మాట కూడా ఎమ్మెల్యేలు వినడం లేదు. మరోవైపు, మమత నుంచి పార్టీని, పార్టీ గుర్తును చేజిక్కించుకునే ప్రయత్నాల్లో రెబల్ ఎమ్మెల్యేల ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పిలుపు ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. మంగళవారం కోల్కతాలో జరిగిన ధర్నాకు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు కేవలం ఐదుగురే హాజరు కావడం సంచలంగా మారింది. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ రెబల్ వర్గం దీదీకి ఎదురుతిరుగుతోంది.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీకి చెందిన అన్ని కమిటీలు, దాని అనుబంధ సంస్థల్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. పార్టీ అన్ని స్థాయిల్లో సమగ్రమైన ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత సమీక్ష ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పింది. దీని తర్వాత కమిటీలను పునర్నిర్మించి, తగిన సమయంలో ప్రకటిస్తామని చెప్పింది.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
అయితే, అసెంబ్లీ ఎన్నికత తర్వాత టీఎంసీ అగ్రనాయకత్వంలో చీలిక ఏర్పడిందని తెలుస్తోంది. అనుబంధ సంస్థలు హైకమాండ్ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని కమిటీలను రద్దు చేసినట్లు తెలిసింది. టీఎంసీకి సుమారు 16 అనుబంధ సంస్థలు ఉన్నాయి. పార్టీలోని యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు మొదలైన వివిధ విభాగాలకు సంబంధించిన అనుబంధ విభాగాలు ఉ న్నాయి. ఇక కమిటీల విషయానికి వస్తే టీఎంసీకి ఒక ప్రధాన కార్యనిర్వాహక కమిటీ ఉంది. దీనికి తోడుగా కోర్ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా, బ్లాక్ కమిటీలు, క్రమశిక్షణా కమిటీ ఉన్నాయి. సంక్షోభం నేపథ్యంలో తృణమూల్ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!