ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘AA22’ (వర్కింగ్ టైటిల్) గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ కావడంతో, దీనిపై ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది.
Also Read : NTRNeel : ఫస్ట్ లుక్ కూడా రాకుండానే రూ. 55 కోట్ల ఓవర్సీస్ డీల్.. NTR మాస్ ర్యాంపేజ్
అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 8న చిత్రబృందం ఒక భారీ మీడియా ఈవెంట్ను ప్లాన్ చేస్తోంది. ఈ వేదికపైనే సినిమాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫస్ట్ లుక్ మరియు టీజర్ను విడుదల చేయనున్నారు. ప్రేక్షకులకు ఈ ప్రాజెక్ట్ యొక్క థీమ్ ను పరిచయం చేయడమే కాకుండా, సినిమా కథాంశంపై ఒక చిన్న గ్లింప్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ‘సన్ పిక్చర్స్’ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అని, ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపిస్తారని టాక్. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ మరియు టాప్ క్లాస్ VFX కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. 2027 వేసవి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 8న రాబోయే అప్డేట్తో ఈ సినిమాపై ఉన్న సస్పెన్స్ వీడనుంది.