‘మేజర్’ కి అక్కడ ఆదరణ లభిస్తుందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడవి శేష్… చిత్రపరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం. చిత్రపరిశ్రమలో తనకంటూ ఎలాంటి అండదండలు లేకున్నా ఒక్కో స్టెప్ ఎదుగుతూ… ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న నటుడు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి హిట్స్ తర్వాత చక్కటి ఫాలోయింగ్ తెచ్చుకున్న శేష్ ప్రస్తుతం ‘మేజర్’ పేరుతో ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. రచయిత కావటం శేష్ కి ఉన్న అదనపు బలం. ‘మేజర్’తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అడవిశేష్. ఈ సినిమాకు కథను సమకూర్చుకుంది కూడా తనే. 2008లో ముంబై ఎటాక్స్ లో ఉగ్రవాదులపై పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ‘మేజర్’ తెరకెక్కటం విశేషం. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే 25 మిలియన్స్ వ్యూస్ ని దక్కించుకుంది. మరి టీజర్ లాగే సినిమా కూడా హిట్ అయి అడవి శేష్ కి బాలీవుడ్ లోనూ గుర్తింపు దొరుకుతుందేమో చూడాలి. నిజానికి ఈ తరహా కథాంశాలతో కూడిన సినిమాలకు బాలీవుడ్ లో ప్రజాదరణ బాగుంటుంది. శేష్ని కూడా అలాగే ఆదరిస్తారేమో చూద్దాం.
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..