Chota K Naidu: మోహన్బాబు పేరు విని వెనకడుగు వేశా.. విష్ణు ఇంకోసారి ఆ పని చేయకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chota K Naidu Comments Mohan Babu Chota K Naidu: మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘జిన్నా’ సినిమా ఈనెల 21న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సినిమాటోగ్రఫర్ ఛోటా కే నాయుడు మాట్లాడుతూ.. ‘‘నేను మంచు కాంపౌండ్లో చేసిన తొలి సినిమా ఇది. తొలుత ఈ కథ తనకు కోన వెంకట్ వినిపించినప్పుడు నాకు బాగా నచ్చింది. సెకండాఫ్ అయితే మరింత అద్భుతంగా ఉంది. దీంతో ఈ సినిమా చేద్దామని అన్నాను. హీరో మంచు విష్ణు అనగానే, ఓకే అన్నాను. కానీ.. ఈ సినిమాకి మోహన్బాబు నిర్మాత అన్నప్పుడు వెంటనే కారు ఆపేయమని అన్నాను. ఈ సినిమా చేయనని చెప్పాను. ఎందుకని కోన వెంకట్ ప్రశ్నిస్తే.. మోహన్బాబుకు నేనంటే నచ్చదు, ఆయనకు నేనంటే కోపం, అగ్నిపర్వతాలు బద్దలైపోతాయని చెప్పాను. అప్పుడు నాకు నచ్చజెప్పి, మోహన్బాబు ఆఫీస్కి తీసుకెళ్లారు’’ అని చెప్పాడు.
‘‘ఆఫీస్కి వెళ్లగానే ఆయన స్వాగతించిన విధానం చూసి ఒక్కసారిగా షాకయ్యా. బహుశా ఆయన గురించి నేను అనుకున్న పర్సెప్షన్ తప్పు అయ్యుంటుందని ఆ క్షణం అనిపించింది. అంతేకాదు.. ఈ సినిమా విషయంలో ఆయన నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నన్ను మరో కొడుకుగా చూసుకున్నారు’’ అని మోహన్బాబు గురించి ఛోటా కే నాయుడు చెప్పుకొచ్చాడు. అనంతరం మంచు విష్ణు గురించి మాట్లాడుతూ.. ‘‘షూటింగ్లో విష్ణు నస పెడతాడేమోనని అనుకున్నాను. కానీ, ఏ విషయంలోనూ అతడు జోక్యం చేసుకోలేదు. నేను అనుకున్న విష్ణు వేరు.. నేను చూసిన విష్ణు వేరు. సినిమా కోసం అతడు ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. అతని కాలుకి అయిన గాయమే అందుకు నిదర్శనం. ఒక సీన్లో రింగులు తిరుగుతూ జంప్ చేయాల్సి వస్తుంది. దాని వల్ల కాలుకి గాయం అయ్యింది. రిస్క్ చేయాలి కానీ, మరి ఎక్కువ రిస్క్ చేయకూడదు. కాబట్టి, మరీ గాయాలయ్యేంత రిస్కులు చేయొద్దని విష్ణుకి సూచిస్తున్నాను’’ అంటూ పేర్కొన్నాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని తనకు నమ్మకం ఉందని, ఇది మోహన్బాబుకి ఇచ్చే గిఫ్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా డైరెక్టర్ సూర్యలో తనకు ఒక క్రాంతి, ఒక జంధ్యాల కనిపించారని అన్నాడు. కోన తనను మోహన్బాబు దగ్గర ఇరికించాడని తాను అనుకున్నానని, కానీ కోన వల్ల తనకు మరో ఆస్తి దొరికినట్టు అయ్యిందని ఛోటా కే నాయుడు వెల్లడించాడు.
Also Read
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..