35 ఏళ్ళ చిరంజీవి ‘యముడికి మొగుడు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Yamudiki Mogudu Completed 35 Years: తెలుగు చిత్రసీమలో ఈ నాటికీ మహానటుడు యన్టీఆర్ సినిమాల సూత్రాలనే అనుసరిస్తూ సినిమాలు రూపొందుతూ ఉండడం విశేషం! మూడున్నర దశాబ్దాల క్రితం బ్లాక్ బస్టర్ గా నిలచిన చిరంజీవి ‘యముడికి మొగుడు’కు కూడా యన్టీఆర్ చిత్రాలే స్ఫూర్తి. అంతకు ముందు రామారావు నటించిన “దేవాంతకుడు, యమగోల” చిత్రాల స్ఫూర్తితోనే చిరంజీవితో ‘యముడికి మొగుడు’ చిత్రం రూపొందింది. చిరంజీవికి ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చదివే రోజుల్లో మిత్రులైన సుధాకర్, హరిప్రసాద్ తో పాటు నారాయణరావు కూడా తోడై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘యముడికి మొగుడు’ నిర్మించారు. డైనమిక్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా, ఆయన సరసన విజయశాంతి, రాధ నటించారు. 1988 ఏప్రిల్ 29న విడుదలైన ‘యముడికి మొగుడు’ ఆ యేడాది బిగ్ హిట్ గా నిలచింది.
‘యముడికి మొగుడు’ కథ ఏమిటంటే – కోటప్ప, కైలాసం వ్యాపారంలో ప్రత్యర్థులే అయినా, ఆప్తమిత్రుల్లా కలుసుకుంటూ ఉంటారు. కాళి అనే రౌడీ మనసున్నవాడు. ఉన్నవారిని దోచి లేనివారికి సాయంచేసే కాళి అంటే ఎంతోమందికి అభిమానం. అతను కోటప్ప నియమిస్తే వెళ్ళి కైలాసంను బెదిరిస్తాడు. అప్పుడే కైలాసం కూతురు రాధ, కాళిని చూసి మనసు పారేసుకుంటుంది. కాళి, రాధ గాఢంగా ప్రేమించుకొని పెళ్ళి చేసుకోవాలను కుంటారు. ఈ విషయం తెలిసిన కైలాసం యాక్సిడెంట్ చేయించి, కాళిని చంపించేస్తాడు. దాంతో కాళి నరకానికి వెళతాడు. అక్కడ యముడు,చిత్రగుప్తునితో కాళి తనను తప్పుగా నరకానికి తీసుకువచ్చారని అంటాడు. తప్పును సరిదిద్దుకోవడానికి యముడు, చిత్రగుప్తుడు భూలోకం వెళ్ళి కాళి దేహం కోసం గాలిస్తారు. అప్పటికే కాళి పార్థివదేహానికి దహనసంస్కారాలు జరిగిపోయి ఉంటాయి. వేరే శరీరంలో ప్రవేశించమని యమ,చిత్రగుప్త కోరతారు. అందుకు కాళి అంగీకరించడు. దాంతో అచ్చు కాళి లాగే ఉండే బాలరాజు అనే మనిషి శరీరంలో ప్రవేశించమని అంటారు. అమాయకుడైన బాలరాజు అతని బాబాయి గోపాలరావు చేతిలో పలు పాట్లు పడుతుంటాడు. అతని అడ్డు తొలగించుకొని ఆస్తి కాజేయాలని గోపాలరావు, అతని కొడుకు ఆశిస్తారు. ఈ లోగా బాలరాజు శరీరంలో కాళి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ నుంచీ బాబాయ్, ఆయన కొడుకు ఇద్దరి భరతం పడతాడు బాలరాజులోని కాళి. బాలరాజు నేస్తం గౌరికి భలే ఆనందం కలుగుతుంది. బాలరాజును చంపాలని ప్రయత్నిస్తాడు గోపాలరావు. దానిని బయట పెడతాడు బాలరాజు. ఇంట్లోంచి గెంటేయగా బాబాయ్, ఆయన కొడుకు కలసి పట్నంలోని తమ మిత్రులు కైలాసంను కలుసుకుంటారు. అక్కడికీ బాలరాజులోని కాళి వెళతాడు. చనిపోయినవాడు ఎలా బతికి వచ్చాడో తెలియక కైలాసం తికమక పడతాడు. అందరూ కలసి మళ్ళీ బాలరాజును చంపాలని చూస్తారు. బాలరాజు తల్లిని, గౌరిని కట్టేసి చంపాలనుకుంటారు. అలాగే భూలోకంలో కాళి ఆయుర్దాయం తీరిపోయింది కాబట్టి, మళ్ళీ నరకానికి రమ్మంటారు యమధర్మరాజు, చిత్రగుప్తుడు. అతని కోసం ప్రాణం పెట్టుకున్న రాధ, గౌరి కోసం బాలరాజుతో పాటు కాళి ఆత్మను కూడా ఉండమనే చెబుతారు యమధర్మరాజు. ఈ శరీరం ఒకరిది, ఆత్మ నాది వారిద్దరిలో ఎవరి చేసుకోవాలని బాలరాజులోని కాళి అడుగుతాడు. అందుకు అతని చెవిలో యమధర్మరాజు ఓ దేవరహస్యం చెబుతాడు. రాధ, గౌరి ఎవరో ఒకరు త్యాగం చేయాలని భావిస్తారు. అయితే వారి చెవుల్లోనూ యమధర్మరాజు తనకు చెప్పిన దేవరహస్యం చెబుతాడు బాలరాజులోని కాళి. ఇద్దరు ముద్దుగుమ్మలు అతణ్ణి కౌగిలించుకుంటారు. వారిని యమధర్మరాజు, చిత్రగుప్తుడు, విచిత్రగుప్తుడు ఆశీర్వదించడంతో కథ సుఖాంతమవుతుంది.
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, సుత్తివేలు, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, సుధాకర్, ప్రసాద్ బాబు, సూర్యకాంతం, అన్నపూర్ణ, వై.విజయ, మమత, నిర్మల, ప్రియాంక, హరిప్రసాద్, శివప్రసాద్ నటించారు. “నాట్యమిదా…” అంటూ సాగే పాటలో అంబిక నర్తించారు. ఈ చిత్రానికి సత్యానంద్ రచన చేయగా, రాజ్-కోటి బాణీలకు అనువుగా వేటూరి సుందరరామ్మూర్తి పాటలు పలికించారు. ఇందులోని “బహుశా నిన్ను బందరులో చూసివుంటా…”, “అందం హిందోళం…”, “ఎక్కు బండెక్కు…”, “వానజల్లు గిల్లుతుంటే…”, “కన్నెపిల్లతోటి వచ్చెనమ్మా…”, “నాట్యమిదా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
తెలుగునాట ‘దేవాంతకుడు, యమగోల’ మొదలు అనేక చిత్రాలు యముని పాత్ర నేపథ్యంలో రూపొంది విజయం సాధించాయి. వాటిలో చిరంజీవి ‘యముడికి మొగుడు’ కూడా నిలచింది. ‘యముడికి మొగుడు’ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ‘యముడికి మొగుడు’ చిత్రం డైరెక్టర్ రవిరాజా పినిశెట్టికి తొలి ఘనవిజయం అని చెప్పవచ్చు. అంతకు ముందు రవిరాజా నిర్దేశకత్వంలో రూపొందిన చిత్రాలు ఓ మోస్తరు విజయాన్నే చవిచూశాయి. ఈ సినిమాను తరువాత రజనీకాంత్ హీరోగా ‘అతిశయ పిరవి’పేరుతో తమిళంలో రీమేక్ చేయగా, అక్కడా విజయం సాధించింది. ‘చిరంజీవి’ పేరుతో ‘యముడికి మొగుడు’నే హిందీలో డబ్ చేశారు. చిత్రమేమిటంటే, రజనీకాంత్ ‘అతిశయ పిరవి’ని కొన్నేళ్ళ తరువాత మళ్ళీ తెలుగులో అనువదించారు. అల్లరి నరేశ్ హీరోగా ‘యముడికి మొగుడు’ టైటిల్ లోనే 2012లో ఓ సినిమా వచ్చింది.
తాజావార్తలు
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!