Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. టాలీవుడ్ నుంచి చిరంజీవికి ఆహ్వానం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Invited for Ayodhya Ram Mandir Opening Ceremony from tollywood: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుక కోసం టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరుగనుంది. అన్ని వర్గాల, రంగాల నుంచి ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించబడుతున్నారు. ఇక ఈ వేడుకకి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపబడింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవికి ఒక్కరికే ఆహ్వానం అందింది. తమిళం నుంచి రజనీకాంత్, ధనుష్, మలయాళం నుంచి మోహన్లాల్, కన్నడ నుంచి కాంతార నటుడు రిషబ్ శెట్టిలకు ఈ ఆహ్వానం అందింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి నిర్మాత మహావీర్ జైన్కి కూడా ఆహ్వానం అందింది. ఇక బాలీవుడ్ నుంచి నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్లకు ఆహ్వానం అందింది.
Nikhil Siddhartha: సలార్ సినిమా 1 గంట షోకి 100 టికెట్లు ఇస్తా.. హీరో నిఖిల్ బంపర్ ఆర్
Also Read
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
- Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
రాజ్కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ మరియు రోహిత్ శెట్టి వంటి బాలీవుడ్ దర్శకులని ఆహ్వానించారు. ఇక ఈ శ్రీ రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిరం గర్భగుడిలో ప్రతిష్టిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇక క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్తలలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా కూడా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొంటారని బాలీవుడ్ మీడియా నివేదించింది. ఇక శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ఈ గౌరవనీయులైన వారితో ఘనంగా నిర్వహించబడుతుందని హామీ ఇచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం, రామమందిరం ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కర సేవకుల కుటుంబ సభ్యులను నిర్వాహకులు ఆహ్వానించారు. అంతేకాకుండాఈ ప్రతిష్ఠ వేడుక దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!