Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
- ‘16 వయతినిలే’తో తమిళ సినిమాకు కొత్త దిశ
- తెలుగు చిత్రసీమతోనూ ప్రత్యేక అనుబంధం
- పద్మశ్రీతో పాటు అనేక జాతీయ పురస్కారాలు
- దర్శకుడిగానే కాదు.. నటుడిగానూ చెరగని ముద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharathiraja Passed Away : తమిళ చలనచిత్ర చరిత్రలో గ్రామీణ కథలకు సరికొత్త దిశను చూపి, వెండితెరపై పల్లెటూరి అందాలను అత్యంత అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజం, “దర్శక ఇమయం” భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఆఖరి శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత చిత్రాలను అందించి, ప్రేక్షకులను అలరించిన ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటును మిగిల్చింది.
తొలి చిత్రంతోనే సంచలనం.. పల్లెటూరి కథలకు ప్రాణం
1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా, 1977లో విడుదలైన “16 వయతినిలే” చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి అప్పట్లోనే పెద్ద సంచలనం సృష్టించారు. అప్పటివరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను అవుట్డోర్కు తీసుకొచ్చి, తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని , అక్కడి సహజత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే ఆయనను అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఎంతో గౌరవంగా “దర్శక ఇమయం” (దర్శకత్వ శిఖరం) అని పిలుచుకుంటారు. ఆయన కెరీర్లో సిగప్పు రోజక్కల్, కిజక్కే పోగుం రైల్, అలైగల్ ఓయ్వతిల్లై, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
తెలుగు సినిమాతో విడదీయరాని బంధం
భారతీరాజా కేవలం తమిళానికే పరిమితం కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ అద్భుతమైన సినిమాలు రూపొందించారు. ఆయన దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ “సీతాకోకచిలుక” సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కడంతో పాటు, ఆయనకు నంది ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా లభించింది. తెలుగులో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ చిత్రం “మంగమ్మగారి మనవడు” సినిమాకు ఆయనే కథను అందించగా, రాజశేఖర్ నటించిన “పల్నాటి పౌరుషం” చిత్రానికి స్క్రీన్ప్లే సమకూర్చడం విశేషం. తన చిత్రాల ద్వారా రాధా, రాధికా, రేవతి, కార్తీక్ తదితర ఎంతో మంది మేటి నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
పద్మశ్రీ పురస్కారం , నటుడిగా ప్రతిభ
భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన ఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మారి ఆయుధ ఎళుత్తు (యువ), పాండియా నాడు (పల్నాడు), తిరుచిత్రంబలం (తిరు) వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. గ్రామీణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోవడంతో చిత్ర పరిశ్రమ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!