Bellamkonda Srinivas: ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి పెరిగింది.. ఆఫర్లొచ్చినా వదులుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Srinivas Talks About His Bad Days: తెలుగులో ఏడు సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు ఛత్రపతి హిందీ రీమేక్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మే 12వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతంగా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు. తన కెరీర్లో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. మొదటి సినిమా చేశాక తనకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయని.. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టాడు.
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న పీపుల్స్ స్టార్
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి నిర్మాత కావడం వల్లే నేను సినిమాల్లోకి చాలా ఈజీగా వచ్చానని అందరూ అంటుంటారు. అది నిజమే, నా తండ్రి వల్లే సులభంగా పరిశ్రమలోకి వచ్చాను. కానీ.. ఆ తర్వాత నేను హార్డ్ వర్క్ చేయడం వల్లే, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. నా తొలి సినిమా అల్లుడు శీను మంచి విజయం సాధించింది. ఆ సినిమాను నిర్మించిన మా నాన్న, నాకెంతో సపోర్ట్ చేశారు. అయితే.. అందులో సమంత, తమన్నా నటించేందుకు అంత ఈజీగా ఒప్పుకోలేదు. నేను వారికి 5 నిమిషాల డ్యాన్స్, 5 నిమిషాల యాక్టింగ్, 5 నిమిషాల యాక్షన్ వీడియోల క్లిప్లను తీసి, ఒక డెమో వీడియో క్రియేట్ చేసి, వారికి పంపించాను. ఆ వీడియో క్లిప్స్ చైసిన తర్వాతే వాళ్లు అల్లుడు శీనులో నటించేందుకు ఓకే చెప్పారు’’ అని చెప్పుకొచ్చాడు.
ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీలు(మార్కెట్ క్యాపిటల్ ప్రకారం)
ఆ సినిమా మంచి సక్సెస్ సాధించిందని, అయితే ఆ సమయంలోనే తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని శ్రీనివాస్ తెలిపాడు. తన తండ్రి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన 8 సినిమాలు బోల్తాకొట్టడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని అన్నాడు. దాంతో తనపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని.. ఆ ఒత్తిడి వల్లే తొలి సినిమా తర్వాత వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఏడాదిన్నర పాటు తాను ఇంట్లోనే కూర్చుండిపోయానన్నాడు. ఆ తర్వాత తాను తక్కువ బడ్జెట్లో రెండో సినిమా చేశానని, అనంతరం బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన జయ జానకి నాయక చిత్రంతో తాను అన్ని విధాలుగా నిలదొక్కుకున్నానని శ్రీనివాస్ వివరించాడు.
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..