Balagam: అట్లుంటుంది ‘బలగం’ తోని.. కాకి ముట్టలేదని ఆ పని చేసిన కుటుంబం
Balagam: సినిమాల వలన జీవితాలు మారతాయా..? అంటే చాలామంది చాలారకాలుగా చెప్తారు. సమాజాన్ని మార్చలేం కానీ, అందులో ఒక్కరైనా మా సినిమా చూసి మారితే సంతోషమని మేకర్స్ అంటారు. సినిమాను సినిమాలాగా చూడాలి అని అంటారు మరికొంతమంది. ఇక ఇవన్నీ కాదు.. మాకు ఏది నచ్చితే అది తీసుకుంటాం అనేటోళ్లు కూడా లేకపోలేదు. ఇక ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. ఒక సినిమా.., కొన్ని కుటుంబాలను మార్చేసింది. ఆ సినిమానే బలగం. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చూసాకా.. విడిపోయిన అన్నదమ్ములు కలిసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఊరు.. ఊరు మొత్తం ఈ సినిమా చూసి కంటతడి పెట్టుకున్న ఘటనలు జరిగాయి. పెద్దవారు చనిపోయాకా పిట్టకు పెట్టే ఆనవాయితీ ప్రతి తెలుగు కుటుంబంలో ఉంటుంది. ఇక తాజాగా ఒక కుటుంబం..బలగం సినిమాలో కనుక కాకి అన్నం ముట్టకపోతే ఇష్టమైనవి పెట్టినట్లు.. వీరు కూడా తండ్రి చనిపోయాక కాకి అన్నం ముట్టకపోవడంతో తన తండ్రికి నచ్చినవి పెట్టి చూపరులను ఆకర్షించారు. ఇక ఆ తండ్రికి నచ్చినవి ఏంటో తెలుసా.. పేక ముక్కలు.
Pawan Kalyan: ఆయనను మర్చిపోలేం.. పవన్ ఎమోషనల్
Also Read
- Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
- The Paradise: 'ఆయా షేర్' తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. 'ది ప్యారడైజ్' సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
- Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
- Mega 158 Update: 'మెగా 158' నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ 'స్వాగ్'తో బాస్ లుక్.. చూశారా?
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో పూదరి వెంకటరాజ్యం గౌడ్ అనే
80 ఏళ్ల వృద్దుడు ఐదురోజుల క్రితం మరణించాడు. అతనికి ముగ్గురు కొడుకులు.. వెంకటరాజు గౌడ్ 50 సంవత్సరాలుగా చుట్టూ ఉన్న ఏడు గ్రామాలకు గ్రామపెద్దగా వ్యవహరిస్తున్నాడు. ఇక అతను చనిపోయి 5 రోజులు కావస్తుండడంతో కుటుంబ సభ్యులు పిట్టకు పెట్టే కార్యక్రమం చేశారు. ఆయనకు ఇష్టమైన వంటకాలను చేసి.. కుటుంబం మొత్తం కాకి కోసమా ఎదురుచూశారు. కానీ, కాకి రాలేదు. ఇక అప్పుడే వీరికి బలగం సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో కనుక తాతకు నచ్చిన ఫోటో పెట్టి కుటుంబం మొత్తం వచ్చి నిలబడగానే కాకి అన్నం తిని వెళ్తోంది. అదే విధంగా వెంకటరాజు గౌడ్ కు నచ్చింది అక్కడ పెడితే కాకి అన్నం ముట్టిద్దేమో అని ఆలోచించి.. ఆలోచించి.. వెంకటరాజు గౌడ్ కు ఇష్టమైన పేక ముక్కలను తీసుకొచ్చి పళ్లెంలో పెట్టారు. అయినా కాకి ముట్టలేదు. ఇక ఈరోజు.. వెంకటరాజు గౌడ్ కు ఇష్టమైన వంటకాలతో పాటు పేక ముక్కలను, పది రూపాయల నోటును పళ్లెంలో పెట్టి వచ్చారు. తన తండ్రికి ఇష్టమైన ఆహార పదార్థాలతో పాటు పేక ముక్కలు పెట్టడంతో తన తండ్రి ఆత్మ శాంతిస్తుందని భావిస్తున్నట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఏదిఏమైనా ఒక సినిమా వీరి ఆలోచనా విధానాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో