ఏఆర్ రెహమాన్ ఇంట్లో వేడుక… ఎంగేజ్మెంట్ ను ప్రకటించిన కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో తాజాగా వేడుక జరిగింది. ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జనవరి 2న రియాస్దీన్ షేక్ మొహమ్మద్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, ప్రపంచానికి తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. రెహమాన్ తన ఇన్స్టాగ్రామ్ కథనాలలో ఖతీజా పోస్ట్ను పంచుకున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఖతీజా, రియాస్దీన్ డిసెంబర్ 29 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.
Read Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
2020లో బురఖా ఊపిరాడకుండా వేసుకున్న కారణంగా ఖతీజా వివాదంలో చిక్కుకుంది. అయితే ఈ వివాదంపై ఖతీజా పరిణతితో స్పందించారు. తనకు నచ్చినవి వేసుకోవడం తన ఇష్టమని చెప్పింది. ఇప్పుడు ఖతీజా మళ్లీ ఎంగేజ్మెంట్ తో వార్తల్లో నిలిచింది. రియాస్దీన్ షేక్ మొహమ్మద్తో తన నిశ్చితార్థాన్ని ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. ఖతీజా పోస్ట్ ప్రకారం రియాస్దీన్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఆడియో ఇంజనీర్. యాదృచ్ఛికంగా ఖతీజా తన పుట్టినరోజునే రియాస్దీన్తో నిశ్చితార్థం చేసుకుంది.
కాబోయే భర్త ఫోటోను ఖతిజా షేర్ చేస్తూ “సర్వశక్తిమంతుడి ఆశీర్వాదంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్త, విజ్కిడ్ ఆడియో ఇంజనీర్ అయిన రియాస్దీన్ షేక్ మొహమ్మద్ తో నా నిశ్చితార్థం గురించి మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. డిసెంబర్ 29… నా పుట్టినరోజున సన్నిహిత కుటుంబ సభ్యులు, ప్రియమైనవారి సమక్షంలో నిశ్చితార్థం జరిగింది” అంటూ తెలిపారు.
రెహమాన్, ఆయన భార్య సైరా బాను ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. వాళ్ళ పేర్లు ఖతీజా, రహీమా, అమీన్. ఖతీజా తమిళ సినిమాల్లో కొన్ని పాటలు పాడారు. రజనీకాంత్ ‘ఎంథిరన్’లోని ‘పుధియ మనిధ’ పాటను ఆమె తొలిసారిగా పాడింది. ఖతీజా, రియాస్దీన్ల వివాహాన్ని త్వరలో ప్రకటించనున్నారు.

తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!