Allu Arjun: ఎస్పీ మెడకు చుట్టుకున్న అల్లు అర్జున్ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt To Take Action On Nandyal SP Raghuveer Reddy: సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు నంద్యాల వెళ్లారు అల్లు అర్జున్. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు కావడంతో అతని కోసమే హైదరాబాద్ నుంచి వచ్చానని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిపారంటూ అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర రెడ్డి మీద రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. తాజాగా ఈ అంశంలో నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అల్లు అర్జున్ జిల్లాకు వస్తున్నారు అనే సమాచారం తెలిసి కూడా ఎస్పీ స్పందించలేదని, ర్యాలీ నిర్వహించినా కూడా ఏమాత్రం స్పందన లేకుండా చోద్యం చూస్తూ ఊరుకున్నారని రఘువీర్ రెడ్డి మీద ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.
AP Elections 2024: ఫైనల్లీ ఏపీ పోలింగ్ శాతం చెప్పేశారు.. 2019 కంటే ఎంత పెరిగిందంటే?
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
పోలింగ్ కు 48 గంటల ముందు 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ వాటిని నంద్యాల పోలీసులు ఎస్పీ విస్మరించినట్లుగా వచ్చిన ఆరోపణలను ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ధారించినట్లయింది. నంద్యాల పోలీసుల వైఫల్యం మీద కర్నూలు రేంజ్ డీఐజీ ఇచ్చిన నివేదికతో పాటు రాష్ట్ర డిజిపి తీసుకోబోతున్న చర్యల వివరాలను ఈసీకి జవహర్ రెడ్డి పంపించారు. తన స్నేహితుడి కోసం అల్లు అర్జున్ నంద్యాల వస్తున్నారని విషయం తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ముందు రోజు నుంచి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారని విషయం వాట్సాప్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడాన్ని పోలీసులు తప్పిదంగా పేర్కొన్నారు. అక్కడ వేలాదిమంది గుమిగూడిన వారిని అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు ఏమాత్రం చేయలేదని జవహర్ రెడ్డి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నంద్యాల పోలీసులు విఫలమవడం నిజమేనని రెండు పార్టీలకు చెందిన వారు ఒకే సమయంలో పెద్ద ఎత్తున గుమికూడిన విషయాన్ని సైతం రఘువీర్ రెడ్డి తెలియజేయలేదని నివేదికలో ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!