Prathibimbalu: ‘ప్రతిబింబాలు’ వంద రోజుల లెక్క ఏంటి!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prathibimbalu: నలభై ఏళ్ళ క్రితం పూర్తయిన అక్కినేని ‘ప్రతిబింబాలు’ చిత్రం గత ఏడాది నవంబర్ లో విడుదలయింది. ఈ సినిమా చిత్తూరు జిల్లా అరగొండలోని కృష్ణా టాకీసులో వందరోజులు పూర్తి చేసుకున్నట్టు ఓ దినపత్రికలో ప్రకటన వచ్చింది. ఇది ఆ చిత్ర నిర్మాత ఇవ్వలేదు. కొందరు ఏయన్నార్ ఫ్యాన్స్ వారి పేరు లేకుండా ఇచ్చారు.
Read also: Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
నిజానికి ఆ కేంద్రంలో ‘ప్రతిబింబాలు’ చిత్రం నవంబర్ 9వ తేదీన విడుదలై ఒక్క ఆట మాత్రమే ప్రదర్శితమైంది. కానీ, ఫిబ్రవరి 16, 2023న ‘ప్రతిబింబాలు’ వందరోజుల ప్రకటన వెలుగు చూసింది. ఈ మధ్యలో ఆ థియేటర్ లో తాజాగా సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’ మొదటి రోజు ఆడింది. మరుసటి రోజు నుంచీ ‘వాల్తేరు వీరయ్య’ రెండువారాలు ప్రదర్శితమయింది. పక్కనే ఉన్న మండల కేంద్రం తవణం పల్లెలో ‘వీరసింహారెడ్డి’ రెండువారాలు ఆడి, మళ్ళీ మూడోవారంలో అరగొండ కృష్ణాటాకీస్ లో ప్రదర్శితమయింది. అప్పుడు తవణం పల్లెలో ‘వాల్తేరు వీరయ్య’ ఆడింది. ఈ మధ్యలో కొత్త సినిమాలు లేని సమయంలో కృష్ణా టాకీసు మూతపడిఉంది. ఆ థియేటర్ డిజిటల్ కంటెంట్ ఆపరేటర్ అయిన ‘యు.ఎఫ్.ఓ.’ ద్వారా ఈ వివరాలన్నీ కంప్యూటర్ లో రికార్డయి ఉంటాయి. పాపం… ఇది తెలియని పురాతన అభిమానులు పాత రోజుల్లో అలవాటు ప్రకారం ‘ప్రతిబింబాలు’ చిత్రం వంద రోజులు ఆడినట్టు ప్రకటన ఇచ్చారు. ఈ విషయాన్ని ఇతర అభిమానులు, నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
Read also: Modi-Tamilisai Wishes: సీఎం కేసీఆర్ 69వ జన్మదినం.. ప్రధాని, గవర్నర్ సహా ప్రముఖుల విషస్
ఈ మధ్యకాలంలో పలువురు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ తమ చిత్రాలను డబ్బులు ఇచ్చి మరీ ఆడియన్స్ రాకున్నా, కలెక్షన్స్ లేకున్నా వందరోజులు ఆడిస్తున్నారు. అయితే డిజిటల్ కంటెంట్ ఆపరేటర్ కంప్యూటర్ రికార్డింగ్ కూడా ఉండేలా వారు సరి చూసుకుంటున్నారు. డబ్బులు పెట్టి ఆడించినప్పటికీ ఓ సినిమా నిజాయితీగా ఆడిందో లేదో తెలుసుకోవడానికి ఇది ప్రమాణం! అయితే, ఇలాంటివేవీ పట్టించుకోకుండా ‘ప్రతిబింబాలు’ వంద రోజులు ఆడినట్టుగా పేపర్ లో ప్రకటన ఇవ్వడమే ఇప్పుడు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!