Chiranjeevi:నటుడు ఆలీ కుమార్తె వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ వేడుకకు అతిథులను ఆహ్వానించే పనిలో ఉన్నారు ఆలీ దంపతులు. ఇటీవల ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డని, తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలసి ఆహ్వానించిన ఆలి దంపతులు మెగాస్టార్ ని కూడా కలసి తమ ఇంట జరిగే శుభకార్యానికి రమ్మని పిలిచారు. ఆలి కుమార్తె ఫాతిమా డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు. అన్వయ కన్వెన్షన్ లో జరిగే ఫాతిమా, షహనాజ్ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పలుకుతున్నారు ఆలీ దంపతులు.