Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్.. థియేటర్ లో బ్లాస్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో జూన్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎన్ని వివాదాల బారిన పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను ఏఎంబి లో స్పెషల్ స్క్రీనింగ్ వేసిన విషయం తెల్సిందే. ఈ ట్రైలర్ స్క్రీనింగ్ కోసమే బాలీవుడ్ మొత్తం ఏఎంబిలో వాలిపోయింది. ప్రభాస్ అభిమానులు ఏఎంబి లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక అభిమానులతో కలిసి ఆదిపురుష్ చిత్ర బృందం ట్రైలర్ ను వీక్షించింది. టీజర్ కు వచ్చిన నెగెటివిటి.. ట్రైలర్ కు వస్తుందేమో అని భయపడి మేకర్స్ చేయాల్సిన మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే 3డీ లో ట్రైలర్ ను చూపించారని టాక్.
Dead Pixels Trailer: దానికోసం పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన నిహారిక
Also Read
- Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
- Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
- Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
- Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
ఇక ట్రైలర్ టాక్ అదిరిపోతోంది. 3డీ లో ట్రైలర్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ట్రైలర్ ను ఫోన్ ల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలను బట్టి రాముడిగా ప్రభాస్ ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. మూడు నిమిషాలకన్నా పైనే ట్రైలర్ ను కట్ చేశారు. సీతను రావణాసురుడు కిడ్నాప్ చేయడంతో మొదలైన ట్రైలర్.. రావణాసురుడును రాముడు అంతం చేయడంతో ముగుస్తుంది. రామాయణంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని చూపించారు. “ప్రాణాల కన్నా మర్యాదనే ప్రియమైనదా “..? అని లక్ష్మణుడు అడిగిన ప్రశ్నకు.. ” నాకు ప్రాణాలకన్నా మర్యాదనే అధిక ప్రియమైనది” అని రాముడు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇంకా శబరి వద్ద రాముడు పళ్ళు తినడం, ఆంజనేయుడు.. సంజీవిని పర్వతాన్ని ఎత్తడం లాంటి సీన్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ తో అభిమానులను మెప్పించాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇక ట్రైలర్ అనంతరం అందరూ జై శ్రీరామ్ నినాదాలతో ఏఎంబి దద్దరిల్లిపోయింది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!