20 ఏళ్ళ ‘నువ్వు లేక నేను లేను’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోగా తరుణ్ కెరీర్ లో తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తోనే మరపురాని విజయాన్ని అందుకున్నారు. ఆ బ్లాక్ బస్టర్ తరువాత ‘ప్రియమైన నీకు’ వంటి హిట్ తరుణ్ దరి చేరింది. అటు పై తరుణ్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ గా ‘నువ్వు లేక నేను లేను’ నిలచింది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రం ద్వారా వై. కాశీ విశ్వనాథ్ దర్శకునిగా పరిచయమయ్యారు. 2002 సంక్రాంతి సంబరాల్లో జనం మదిని విశేషంగా దోచుకున్న చిత్రంగా ‘నువ్వు లేక నేను లేను’ నిలచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే – రాధాకృష్ణ, కృష్ణవేణి ఇద్దరూ చిన్నతనం నుంచీ పోట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరి తండ్రులు మంచి స్నేహితులు. రాధ, కృష్ణ ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని వారికే తెలియదు. వారి మధ్యలో నీరజ అనే అమ్మాయి రావడంతో ఆ విషయం తెలుస్తుంది. ఇద్దరూ పెద్దలకు చెబుదాం అనుకొనే సమయానికి వారి కన్నతండ్రులు నిర్వహిస్తున్న చిట్స్ కంపెనీ దివాళా తీస్తుంది. జనం వారిపై దాడి చేసే సమయంలో మరో పేరున్న ఫైనాన్స్ కంపెనీ అధినేత రామచంద్రయ్య వచ్చి ఆదుకుంటారు. ఆయన మనవడు కృష్ణవేణిని పెళ్ళాడాలని ఆశిస్తాడు. ఆ విషయం రామచంద్రయ్య చెప్పగానే రాధ, కృష్ణ ఇద్దరి తండ్రులు ఎంతో సంతోషిస్తారు. అయితే రాధ, కృష్ణ ప్రేమ రాధ బామ్మకు మాత్రమే తెలుసు. తమ ప్రేమకంటే తండ్రుల గౌరవం ముఖ్యమని కృష్ణవేణికి రాధ నచ్చచెబుతాడు. కానీ, ఆమె అంగీకరించదు. చివరకు బామ్మ కారణంగా విషయం తెలుసుకున్న రామచంద్రయ్య వారి త్యాగానికి కరిగిపోతారు. రాధ, కృష్ణ ఇద్దరినీ ఆశీర్వదించి పెళ్ళి జరిపించడంతో కథ సుఖాంతమవుతుంది.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
కథలో పాతదనమే కనిపించినా, దీనిని దర్శకుడు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో తరుణ్, ఆర్తి అగర్వాల్, లయ, కిరణ్ రాథోడ్, బ్రహ్మానందం, సురీల్, చంద్రమోహన్, శరత్ బాబు, కె.విశ్వనాథ్, ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, గుండు హనుమంతరావు, సుధ, ప్రగతి, లక్ష్మీపతి, రఘునాథ రెడ్డి, సుబ్బరాయ శర్మ, చిత్రం శ్రీను ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ స్వరరచన చేశారు. ఇందులోని “నిండు గోదారి కదా ఈ ప్రేమా…” పాట విశేషాదరణ పొందింది. “నువ్వంటే నాకిష్టం…”, “ఏదో ఏదో…”, “ఎలా ఎలా తెలుపను…” అంటూ సాగే పాటలు కూడా ఆదరణ చూరగొన్నాయి. ఈ చిత్రం కొన్ని కేంద్రాలలో శతదినోత్సవం చూసింది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!