Turmeric: పసుపు వల్ల లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయి.. అవేంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఆయుర్వేద వైద్యంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అనేక వ్యాధులను దూరం చేయడంతో పాటు చర్మ నాణ్యతను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. ఇటీవల అమెరికా నుంచి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. 57 ఏళ్ల మహిళ పసుపు సప్లిమెంట్లు తీసుకోవడం వల్లే కాలేయం దెబ్బతింది. ఆ మహిళ వాపును తగ్గించడానికి రోజూ పసుపు మాత్రలు వేసుకుంది. కానీ.. కొన్ని వారాల్లో ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆమె ముఖం పాలిపోయింది. మూత్రం రంగు నల్లగా మారింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ ఎంజైమ్లు సాధారణం కంటే 60 రెట్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. కాలేయ వైఫల్యానికి చాలా దగ్గరగా ఉంది. పసుపు అధికంగా తీసుకోవడం వల్ల ఆమె కాలేయంపై భారీ ప్రభావం పడింది. చికిత్స తర్వాత, ఆ మహిళ పరిస్థితి మెరుగుపడింది. ఈ ఘటనతో సంచలన విషయాలు బయటపడ్డాయి.
READ MORE: K.K Senthil Kumar: ‘జూనియర్’ కథ నాకు చాలా నచ్చింది.. RRR తర్వాత ఈ సినిమా అందుకే!
Also Read
- Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
- Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
వాస్తవానికి.. కర్కుమిన్ అనేది పసుపులో ఉండే వర్ణద్రవ్యం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కర్కుమిన్ పసుపుకు ప్రకాశవంతమైన పసుపు వర్ణద్రవ్యం ఇస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఆహారానికి రంగు, రుచిని అందించే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు ఉన్నాయి. ఇవి కాలేయంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. కాలేయం అతిపెద్ద శరీర అవయవం. ఇది కొవ్వులను జీవక్రియ చేయడంతో పాటు నిల్వ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం అధికంగా పసుపు తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందని గుర్తించారు. నాలుగు, ఎనిమిది వారాల విడతలుగా ఈ పరిశోధన నిర్వహించారు.
READ MORE: Girls For Sale: ఐదో సంతానంగా ఆడపిల్ల.. అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు
వారికి ఇచ్చే ఆహారంలో పసుపును యాడ్ చేశారు. అలా తీసుకునే వారిలో కాలేయ సమస్యలు ఉత్పన్నమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు నల్ల మిరియాలతో కలిపి పసుపును తీసుకున్నారు. ఇది జీర్ణక్రియకు సహకరించింది. కానీ కేవలం పసుపును తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చాయి. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు, ఉబ్బరం, తలతిరగడం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కర్కుమిన్ కొవ్వు కణాలు పెరగకుండా చేస్తుంది. పిత్తాశయ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పసుపును వీలైనంత తక్కువగా తినాలి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!