Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Baby Sales Rampant In Nizamabad District

Girls For Sale: ఐదో సంతానంగా ఆడపిల్ల.. అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు

Published Date :July 12, 2025 , 10:00 pm
By RameshVaitla
  • నిజామాబాద్ జిల్లాలో జోరుగా పసిపిల్లల విక్రయం
  • వారం వ్యవధిలో ఇద్దరు పసి పిల్లల విక్రయం
  • ముత్యాలమ్మ-వెంకట్ దంపతులకు ఐదో సంతానంగా ఆడపిల్ల
  • ఇద్దరు ఆడపిల్లతో పాటు ఇద్దరు మగ పిల్లలు
  • సోలాపూర్‌కు చెందిన ఓ జంటకు 5రోజుల పసికందు విక్రయం
Girls For Sale: ఐదో సంతానంగా ఆడపిల్ల.. అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

నవమాసాలు మోసిన తల్లికి బిడ్డలు భారం అవుతున్నారు. కంటికి రెప్పలా కాడాపాల్సిన తండ్రి పిల్లల పోషణ భారం అవుతుందని అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టేస్తున్నారు. వారం వ్యవధిలో ఇద్దరు తల్లులు తమ పిల్లలను 2 లక్షలకు విక్రయించారు. డబ్బుల పంపకాల్లో తేడాతో ఓ కేసు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. స్థానికుల సమాచారంతో మరో పసికందు విక్రయం వెలుగు చూసింది. ఈ రెండు కేసుల్లో 9 మందిని అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో పసిపిల్లల విక్రయం జోరుగా సాగుతోంది. వారం వ్యవధిలో ఇద్దరు పసి పిల్లలను అంగట్లో సరుకులా విక్రయించారు. స్థానికుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ పిల్లలను స్వాధీనం చేసుకుని పిల్లలను విక్రయించిన తల్లిదండ్రులతో పాటు కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

Also Read:Cyber Gang Arrest: ఒక్క క్లిక్‌తో అకౌంట్లో ఉన్న డబ్బంతా ఊడ్చేస్తారు..

నిజామాబాద్ మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ముత్యాలమ్మ-వెంకట్ దంపతులకు ఐదో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇప్పటికే వారికి ఇద్దరు ఆడపిల్లతో పాటు ఇద్దరు మగ పిల్లలు ఉండటంతో మరో ఆడపిల్లను పోషించే స్థోమత లేక.. పసికందును అమ్మకానికి పెట్టారు ఆ తల్లిదండ్రులు. ఐదు రోజుల పసికందును మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఓ జంట కొనుగోలు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో శిశు సంక్షేమ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పసికందు జాడ కోసం గాలించి స్వాధీనం చేసుకున్నారు. ఆడపిల్లను పోషించే స్థోమత లేక దత్తతకు ఇచ్చామని తల్లిదండ్రులు చెబుతున్నారు.

Also Read:Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు

నిజామాబాద్ నాగారం క్వార్టర్స్‌కు చెందిన నజీర్ దంపతులకు మూడు రోజుల క్రితం ఓ పండంటి పాప జన్మించింది. పుట్టిన మూడు రోజులకు ఆ బిడ్డను 2 లక్షలకు బేరం పెట్టారు. లక్ష రూపాయలు చెల్లించి బిడ్డను తీసుకెళ్లిపోయారు కొనుగోలుదారులు. మిగతా లక్ష కోసం వివాదం తలెత్తగా బిడ్డను విక్రయించిన విషయం బయటకు పొక్కింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పసికందు విక్రయంపై కూపీ లాగారు. పసికందు కోనుగోలు చేసిన తల్లిదండ్రులతో పాటు విక్రయించిన వారిపై కేసు నమోదు చేశారు. బిడ్డను రెస్క్యూ చేసి బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు.

Also Read:Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు

మూడు రోజుల వ్యవధిలో ఇలా ఇద్దరు పసికందుల విక్రయించారని పోలీసులు తెలిపారు. 2 లక్షల రూపాయలకు పసిపిల్లలను విక్రయించగా.. వారిని పట్టుకుని కేసులు నమోదు చేశామన్నారు నిజామాబాద్ వన్ టౌన్ సీఐ. పిల్లలను చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలని అక్రమంగా కొనుగోలు చేస్తే.. కేసుల పాలవుతారని చెబుతున్నారు.

Also Read:Siddipet Murder: బీమా డబ్బుల కోసం సొంత అత్తకే స్పాట్..

కామారెడ్డి జిల్లాలో ఆడపిల్ల పుట్టిందని.. అప్పుడే పుట్టిన పసికందును వదిలించుకున్నారు. ముక్కుపచ్చలారని ఓ పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. బిచ్కుంద మండలం పెద్ద దేవాడ-పుల్కల్ వంతెన వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. వంతెన వద్ద నవజాత శిశువు ఏడుపులు విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పసికందును స్వాధీనం చేసుకున్న పోలీసులు బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స అందించి.. కామారెడ్డి శిశు గృహకు తరలించారు. బ్రిడ్జి వద్ద పసికందును ఎవరు వదిలి వెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read:Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు

మూడు రోజుల వ్యవధిలో ఓ ఆడపిల్లను 2 లక్షలకు ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. మరో తల్లి పేగు బంధాన్ని రోడ్డుపై వదిలేసింది. మరో బిడ్డను కాసుల కోసం అమ్మేసింది కన్న తల్లి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మూడు ఘటనలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • baby sale
  • girls
  • nizamabad district
  • parents

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions