పిజ్జా, బర్గర్ పేర్లు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఎందుకంటే వాటికి చూడగానే తినాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి.. నోటికి రుచిగా ఉంటాయి.. అందుకే చాలా మంది భారతీయులకు పిజ్జాలంటే చాలా ఇష్టం.. ఇష్టం కదా అని రోజూ తింటే ఇక అంతే సంగతులు.. పిజ్జాతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పిజ్జా అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇక ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే.. ఎటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయో కాస్త వివరంగా తెలుసుకుందాం..
పిజ్జాలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ అలాంటి పిజ్జా తింటే రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. గుండె జబ్బుల బారీన అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ప్రాసెస్ చేసిన మాంసం పిజ్జాలో ఉంటుంది.. దాన్ని తరచుగా తింటే బరువు పెరగడంతో పాటుగా గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణంతకర వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు..
ఒక్క పిజ్జాలో 400 లకు పైగా కేలరీలు ఉంటాయి.. పిజ్జా తినడం వల్ల వచ్చే సమస్యలలో మధుమేహం ఒకటి. పిజ్జా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి క్రమంగా డయాబెటిస్గా మారుతుంది.. అలాగే కేలరీలు, మసాలాలు అధికంగా ఉండటం వల్ల కడుపులో అనేక రకాల సమస్యలు రావడంతో పాటుగా, ప్రేగు క్యాన్సర్స్ కూడా రావచ్చు అని నిపుణులు అంటున్నారు.. అందుకే నెలకు ఒకసారి తీసుకోవడం ఓకే.. కానీ తరచు తీసుకున్నారంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.