Health Tips: ఎండవల్ల వచ్చే నలుపు పోవాలంటే.. ఈ చిట్కా ఉపయోగించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాతావరణం కలుషితం అయిపోతోంది. మనిషికి మానసికంగా ఒత్తిడి పెరిగిపోతోంది. తన శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేని బిజీ జీవితంలో మనిషి ఉన్నాడు. అయితే మన శరీరమే మనకు ఆరోగ్యాన్ని, జీవిత కాలాన్ని పెంచుతుందనేది అక్షర సత్యం. బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మంలో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు.
అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. పగటి పూట ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వలన వచ్చే మచ్చలు. ముఖానికి మనం ఎంతగా కప్పుకున్నా, చేతులకు గ్లౌజు వేసుకున్నా ఎండకు ముఖం, చేతులు, కాళ్ళపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంది. మరి దీన్ని ఎలా చేయాలని కొందరు సతమతుంటారు. మీరు బ్యూటీ పార్లల్ కు కూడా వెల్లనవసరం లేకుండా ఇంట్లోనే ఈ చిక్కాను ఉపయోగించవచ్చు. ఒక్కసారి మీరు ట్రైచేసి చూడండి.
Also Read
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
ఎర్రగా పండిన టొమాటో తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత మంచి నీళ్లతో కడిగేయాలి. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటంతో పాటు సి-విటమిన్ ఉంటుంది. దీంతో ట్యానింగ్ సులువుగా పోతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.
నిమ్మరసం, చక్కెర ఫేస్మాస్క్ను అతి సులువుగా తమారు చేయవచ్చు. ముందుగా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని బౌల్లో తీసుకుని దానికి ఒక టీస్పూన్ చక్కెర జత చేయాలి. ఆ మిశ్రమాన్ని స్ర్కబ్బర్లా ముఖానికి పట్టించాలి. ఇలా చేయటం వల్ల ట్యానింగ్ మటుమాయం అవుతుంది. నిమ్మలో విటమిన్ -సి పుష్కలం కాబట్టి చర్మం మరింత మృదువుగా తయారవుతుంది. మొత్తానికి ఈ మాస్క్ను వేసుకున్నాక.. పదిహేను నిమిషాల్లో కడిగేయాలి.
కాస్త బొప్పాయి పండు మెత్తని గుజ్జును తీసుకని, అందులోకి టేబుల్ స్పూన్ తేనే, మరో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. మెత్తగా చూర్ణం చేయాలి. ఎండకు చర్మం నల్లబడిన ప్రాంతంలో పట్టిస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్తో మొటిమల సమస్య దరిచేరదు.
బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, టేబుల్ స్పూన్ పసుపు వేసి చూర్ణం చేయాలి. ఈ పేస్ట్ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూన్ శనగపిండి, మరో టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఆ పేస్ట్ను ముఖానికి పట్టిస్తే ట్యానింగ్ బాధ పోతుంది.
Telangana Health Director: పెరుగుతున్న కరోనా కేసులు.. ముంచుకొస్తున్న డెంగ్యూ
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?