Health Tips: ఎండవల్ల వచ్చే నలుపు పోవాలంటే.. ఈ చిట్కా ఉపయోగించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాతావరణం కలుషితం అయిపోతోంది. మనిషికి మానసికంగా ఒత్తిడి పెరిగిపోతోంది. తన శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేని బిజీ జీవితంలో మనిషి ఉన్నాడు. అయితే మన శరీరమే మనకు ఆరోగ్యాన్ని, జీవిత కాలాన్ని పెంచుతుందనేది అక్షర సత్యం. బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మంలో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు.
అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. పగటి పూట ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వలన వచ్చే మచ్చలు. ముఖానికి మనం ఎంతగా కప్పుకున్నా, చేతులకు గ్లౌజు వేసుకున్నా ఎండకు ముఖం, చేతులు, కాళ్ళపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంది. మరి దీన్ని ఎలా చేయాలని కొందరు సతమతుంటారు. మీరు బ్యూటీ పార్లల్ కు కూడా వెల్లనవసరం లేకుండా ఇంట్లోనే ఈ చిక్కాను ఉపయోగించవచ్చు. ఒక్కసారి మీరు ట్రైచేసి చూడండి.
Also Read
- Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
ఎర్రగా పండిన టొమాటో తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత మంచి నీళ్లతో కడిగేయాలి. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటంతో పాటు సి-విటమిన్ ఉంటుంది. దీంతో ట్యానింగ్ సులువుగా పోతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.
నిమ్మరసం, చక్కెర ఫేస్మాస్క్ను అతి సులువుగా తమారు చేయవచ్చు. ముందుగా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని బౌల్లో తీసుకుని దానికి ఒక టీస్పూన్ చక్కెర జత చేయాలి. ఆ మిశ్రమాన్ని స్ర్కబ్బర్లా ముఖానికి పట్టించాలి. ఇలా చేయటం వల్ల ట్యానింగ్ మటుమాయం అవుతుంది. నిమ్మలో విటమిన్ -సి పుష్కలం కాబట్టి చర్మం మరింత మృదువుగా తయారవుతుంది. మొత్తానికి ఈ మాస్క్ను వేసుకున్నాక.. పదిహేను నిమిషాల్లో కడిగేయాలి.
కాస్త బొప్పాయి పండు మెత్తని గుజ్జును తీసుకని, అందులోకి టేబుల్ స్పూన్ తేనే, మరో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. మెత్తగా చూర్ణం చేయాలి. ఎండకు చర్మం నల్లబడిన ప్రాంతంలో పట్టిస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్తో మొటిమల సమస్య దరిచేరదు.
బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, టేబుల్ స్పూన్ పసుపు వేసి చూర్ణం చేయాలి. ఈ పేస్ట్ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూన్ శనగపిండి, మరో టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఆ పేస్ట్ను ముఖానికి పట్టిస్తే ట్యానింగ్ బాధ పోతుంది.
Telangana Health Director: పెరుగుతున్న కరోనా కేసులు.. ముంచుకొస్తున్న డెంగ్యూ
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..