Telangana Health Director: పెరుగుతున్న కరోనా కేసులు.. ముంచుకొస్తున్న డెంగ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశం మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కొత్తగా 10 మంది మరణించగా, 4,216 మంది వైరస్నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 3081 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళలో 2415 కేసులు, ఢిల్లీ 655, కర్ణాటక 525, హర్యానాలో 327 చొప్పున నమోదయ్యాయి. కాగా, పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.69 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,94,92,71,111 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
అయితే .. 2019లో రాష్ట్రంలో డెంగీ కేసులు అధికమొత్తంలో నమోదు అయ్యాయని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 158 డెంగీ కేసులు నమోదయ్యాయని, అందులో ఏప్రిల్, మే నెలల్లోనే వంద కేసులు రికార్డు అయ్యాయన్నారు.
మురికి వాడల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, అక్కడ 150 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 10 వేల మంది శాంపిళ్లకు డెంగీ పరీక్షలు చేసినట్లు తెలిపారు. జిల్లాల్లో పెద్దగా డెంగీ ప్రభావం లేదన్నారు. పగటి దోమ వల్ల డెంగీ కేసులు పెరుగుతాయని, కాబట్టి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. తమ అంచనా ప్రకారం ఈసారి డెంగీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు.
హైదరాబాద్లో చెరువులు, నీటి కుంటలు ఎక్కువగా ఉన్నందున దోమలు వృద్ధి చెందాయని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందే డెంగీ కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, వాటిల్లో 15 భవనాలను కొత్తగా నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!