ఈ ఆహార పదార్థాలు తీసుకున్నాక మంచినీరు తాగొద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహారం తిన్న తర్వాత వెంటనే మంచినీరు తాగడం మీకు అలవాటా.? కానీ ఈ ఆహార పోదార్థాలు తీసుకున్నాక మాత్రం అస్సలు నీటి జోలికి వెళ్లకండి.
భోజనానికి ముందు గానీ తినేప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉండటమే దీనికి కారణం. మంచినీరు తాగడం వల్ల ఆహారం త్వరితంగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆహారం తీసుకున్నాక.. నీటిని తాగడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అవేంటో చూద్దాం…
Also Read
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
- Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
పుచ్చకాయ:
పుచ్చకాయ తిన్న తర్వాత మంచినీళ్లు తాగితే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఆహారాన్ని శోషించుకోవడాన్ని, జీర్ణం కావడాన్ని నీరు నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా కడుపులో ఆమ్లస్థాయిలు పెరిగిపోతాయి.
అరటి పండు:
అరటి పండు తిన్న తర్వాత మంచి నీళ్లు తాగొద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి నీరు అస్సలే తాగ్గొద్దట. ఇలా చేస్తే తీవ్రమైన అజీర్తి సమస్య తలెత్తుందని హెచ్చరిస్తున్నారు. అరటి పండు తిన్నాక పావు గంట తర్వాతే నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు.
వేరు శనగ:
వేరు శనగలు తిన్నాక మంచినీళ్లు తాగక పోవడమే మంచిది. వేరు శనగల్లో నూనె మోతాదులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినగానే నీటిని తాగడం వల్ల ఆహారనాళంలో కొవ్వులు పేరుకుపోతాయి. దగ్గు, గొంతు మంటకు ఇది దారి తీస్తుంది.
నిమ్మజాతి పండ్లు:
నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని తిన్నాక.. నీటిని తాగడం వల్ల పొట్టలో పీహెచ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఫలితంగా ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
పాలు:
గోరు వెచ్చని పాలు తాగక మంచినీరు తాగితే కడుపు నొప్పి వస్తుంది లేదా పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది. పాలు తాగాక నీరు తాగడం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. పాలు తాగిన తర్వాత పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. కానీ నీటిని తాగడం వల్ల ఇవి పలుచన అవుతాయి. దీంతో శరీరం మరింతగా ఆమ్లాలు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇది అసమతుల్యతకు దారి తీస్తుంది.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!