చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.. ఉదయం 10 దాటినా కూడా చలి తగ్గలేదు.. ఈ చలి నుంచి బయట పడాలంటే వేడిని ఇచ్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.. ఆరోగ్యకరమైన ఆహారాల్లో బాదం ఒకటి.. ఇవి పోషకాల భాండాగారం. కానీ వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో బాదాం ను తీసుకోవచ్చునా లేదా అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ కె, ప్రోటీన్, ఫైబర్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. కానీ వీటిని చలికాలంలో మరి ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి అనారోగ్య వస్తాయో చూద్దాం..
రెగ్యులర్ గా బాదం పప్పులను ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే బాదంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే అవసరమైన దానికంటే ఫైబర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు..
మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే బాదం పప్పులను ఎక్కువగా తినడం మానుకోండి. వాస్తవానికి ఈ పప్పుల్లో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ మరింత పెరుగుతాయి..
అలాగే విటమిన్ ఇ మెండుగా ఉంటుంది. ఇది మన జుట్టు పెరిగేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ బాదం పప్పులను ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విటమిన్ ఎక్కువగా ఉంటే రక్తస్రావం వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి..
చర్మంపై దద్దుర్లు, వాపు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని తక్కువ పరిమాణంలోనే తినండి. అనాఫిలాక్సిస్ వంటి అలెర్జీలతో బాధపడేవారు బాదంను అస్సలు తినకండి..
బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వు కూడా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా కొద్దిమొత్తంలోనే తినాలి.. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.