Sweet Shock: స్వీట్ షాక్.. తగితే చూడలేరంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sweet Shock: స్వీట్ షాక్ తగితే చూడలేరని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటని ఆలోచిస్తున్నారా.. మీరు చదివింది కరెక్ట్. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అధిక చక్కెర స్థాయిలు మధుమేహానికి కారణం కావడంతో పాటు, రెటీనాలోని చిన్న రక్త నాళాలను ప్రభావితం చేసే తీవ్రమైన డయాబెటిక్ రెటినోపతి అనే తీవ్రమైన కంటి వ్యాధికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Acidity: ఒక్క “టీ”తో ఎసిడిటీ మాయం?.. ఇంట్లోని వస్తువులతో ట్రై చేయండి..
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. అధిక చక్కెర వినియోగంతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. స్వీట్ ఎక్కువగా తింటే కలిగే ప్రమాదాలను మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుందని, కానీ లక్షణాలు మాత్రం క్రమంగా కనిపిస్తాయని చెబుతున్నారు. మీకు అత్యంత సాధారణంగా కనిపించే లక్షణం కంటి దృష్టి మసకబారడం. కొన్నిసార్లు రాత్రి సమయంలో చూపు అస్పష్టంగా మారుతుంది. తరచుగా కంటి ఇన్ఫెక్షన్లు లేదా వాపు కూడా ఒక సంకేతం కావచ్చు. ఈ లక్షణాలన్నీ దృష్టి లోపం, డయాబెటిక్ రెటినోపతిని సూచిస్తాయని చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉంటే సకాలంలో చికిత్స ప్రారంభించడానికి వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
క్రమం తప్పకుండా ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల రెటీనా తగినంత ఆక్సిజన్ పొందకుండా నిరోధిస్తుంది. ఇది అసాధారణమైన కొత్త రక్త నాళాలు ఏర్పడటానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నాళాలు పెళుసుగా ఉంటాయని, ప్రమాదవశాత్తు ఒక వేళ నాళాలు పగిలిపోతే కళ్లలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని చెబుతున్నారు. దీంతో దృష్టి మసకబారడం, లేదా అంధత్వం రావడం జరుగుతుందని చెబుతున్నారు.
ఏం చేయాలంటే..
రోజువారీ జీవితంలో చక్కెర తీసుకోవడాన్ని పరిమితం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవద్దని, స్వీట్లు తినడానికి బదులుగా పండ్లు , ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలని చెబుతున్నారు. కనీసం ఏడాదికి ఒకసారైన కళ్లను చెక్ చేయించుకోవాలని, క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉండటం మంచిదని అంటున్నారు. కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఆకుపచ్చ కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజూవారి ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.
READ ALSO: Russia–China: ముంచుకొస్తున్న మరో యుద్ధం.. తైవాన్పై దాడికి చైనాకు రష్యా సాయం..!
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!