Rice Water: బియ్యం కడ నీళ్లు పడేస్తున్నారా? ఇలా చేయండి..
- బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు..
- బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది..
- ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది..
- రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది..
- బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Water: చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారేస్తారు. కానీ బియ్యం కడిగిన నీటిని పారేయడం కంటే వాటిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు ఉన్నాయని, ముఖ్యంగా బి విటమిన్, ఇ విటమిన్, భాస్వరం, పొటాషియం మరియు తక్కువ మొత్తంలో గంజి ఉంటాయని చెప్పారు. బియ్యం కడిగిన నీటిని వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, జుట్టుకు కూడా మంచిదని చెబుతారు. మనకు ప్రధాన ఆహారం అయిన అన్నం వండడానికి బియ్యం కడిగినప్పుడు, సహజంగా కడిగిన నీటిని పారేస్తాము.

Also Read
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
- Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
- Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
బియ్యం కడిగిన నీరు మన జుట్టు ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటిలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ మన జుట్టు సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లను జుట్టుపై పోసి మర్దన చేస్తే అందులోని పోషకాలు మన వెంట్రుకల కుదుళ్లలోకి చేరుతాయి. ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు బియ్యం కడిగే నీటిలో ఇనోసిటాల్, ఫైటిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేయడమే కాకుండా.. చర్మాన్ని కాపాడుతుంది, తేమను అందిస్తుంది, ముఖంపై మంటను తగ్గిస్తుంది. బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగితే, అది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తిని నివారిస్తుంది.

బియ్యం కడిగిన నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పూర్వం అన్నం వండేటప్పుడు గంజి పోసి గంజి తాగేవారు. గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!