Rice Water: బియ్యం కడ నీళ్లు పడేస్తున్నారా? ఇలా చేయండి..
- బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు..
- బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది..
- ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది..
- రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది..
- బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Water: చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారేస్తారు. కానీ బియ్యం కడిగిన నీటిని పారేయడం కంటే వాటిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు ఉన్నాయని, ముఖ్యంగా బి విటమిన్, ఇ విటమిన్, భాస్వరం, పొటాషియం మరియు తక్కువ మొత్తంలో గంజి ఉంటాయని చెప్పారు. బియ్యం కడిగిన నీటిని వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, జుట్టుకు కూడా మంచిదని చెబుతారు. మనకు ప్రధాన ఆహారం అయిన అన్నం వండడానికి బియ్యం కడిగినప్పుడు, సహజంగా కడిగిన నీటిని పారేస్తాము.

Also Read
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
బియ్యం కడిగిన నీరు మన జుట్టు ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటిలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ మన జుట్టు సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లను జుట్టుపై పోసి మర్దన చేస్తే అందులోని పోషకాలు మన వెంట్రుకల కుదుళ్లలోకి చేరుతాయి. ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు బియ్యం కడిగే నీటిలో ఇనోసిటాల్, ఫైటిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేయడమే కాకుండా.. చర్మాన్ని కాపాడుతుంది, తేమను అందిస్తుంది, ముఖంపై మంటను తగ్గిస్తుంది. బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగితే, అది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తిని నివారిస్తుంది.

బియ్యం కడిగిన నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పూర్వం అన్నం వండేటప్పుడు గంజి పోసి గంజి తాగేవారు. గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?