Rice Water: బియ్యం కడ నీళ్లు పడేస్తున్నారా? ఇలా చేయండి..
- బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు..
- బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది..
- ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది..
- రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది..
- బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Water: చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారేస్తారు. కానీ బియ్యం కడిగిన నీటిని పారేయడం కంటే వాటిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు ఉన్నాయని, ముఖ్యంగా బి విటమిన్, ఇ విటమిన్, భాస్వరం, పొటాషియం మరియు తక్కువ మొత్తంలో గంజి ఉంటాయని చెప్పారు. బియ్యం కడిగిన నీటిని వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, జుట్టుకు కూడా మంచిదని చెబుతారు. మనకు ప్రధాన ఆహారం అయిన అన్నం వండడానికి బియ్యం కడిగినప్పుడు, సహజంగా కడిగిన నీటిని పారేస్తాము.

Also Read
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
బియ్యం కడిగిన నీరు మన జుట్టు ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటిలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ మన జుట్టు సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లను జుట్టుపై పోసి మర్దన చేస్తే అందులోని పోషకాలు మన వెంట్రుకల కుదుళ్లలోకి చేరుతాయి. ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు బియ్యం కడిగే నీటిలో ఇనోసిటాల్, ఫైటిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేయడమే కాకుండా.. చర్మాన్ని కాపాడుతుంది, తేమను అందిస్తుంది, ముఖంపై మంటను తగ్గిస్తుంది. బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగితే, అది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తిని నివారిస్తుంది.

బియ్యం కడిగిన నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పూర్వం అన్నం వండేటప్పుడు గంజి పోసి గంజి తాగేవారు. గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!