Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- వాటర్మిలన్, చికెన్ బిర్యానీ కలిపి తింటే ప్రమాదమా..?
- జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్న డాక్టర్లు..
- భోజనం తర్వాత పుచ్చకాయ తినకపోవడమే బెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food poisoning: ముంబైలో నలుగురు సభ్యుల కుటుంబం రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ, వాటర్మిలన్ తిన్న తర్వాత మరణించారనే విషయం సంచలనంగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఫుడ్ పాయిజనింగ్ వల్లే వారు మరణించినట్లు భావిస్తున్నారు. దీంతో , ఇప్పుడు ప్రజలు పుచ్చకాయను విలన్గా చూస్తున్నారు.
నిజంగా ఈ రెండు కలిపి తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా? అంటే కాదనే సమాధానం డాక్టర్ వద్ద నుంచి వస్తోంది. కానీ ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. భారత్లో వేసవి సమయంలో వాటర్మిలన్ చాలా ఇష్టంగా తింటారు. వేడి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి నీరు అధికంగా ఉంటే దీనిని తినడం చాలా మంచిదిగా భావిస్తారు.
Also Read
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
Read Also: Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
ఇదిలా ఉంటే, చాలా మంది భోజనం తర్వాత వాటర్మిలన్ తినడం వల్ల బ్లోటింగ్(కడుపు ఉబ్బరం)గా అనిపిస్తుందని చెబుతుంటారు. దీని కారణం ‘‘వాటర్ మిలన్’’. ఇది చాలా త్వరగా జీర్ణమవుతుంది. కానీ భోజనంతో ముఖ్యంగా ఫ్యాట్, ప్రొటీన్ ఉన్న ఆహారం తర్వాత తీసుకుంటే జీర్ణక్రియ బ్యాలెన్స్ తప్పుతుంది. ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉంటుంది. ఇదే కాకుండా వాటర్మిలన్లో ఉండే ఫ్రక్టోజ్ పులిసిపోతుంది. గ్యాస్ ఉత్పత్తి కావడం, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యానికి దారి తీస్తుంది.
త్వరగా జీర్ణమయ్యే వాటర్మిలన్ను, ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారంతో కలిపి తిన్నప్పుడు మొత్త జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇరిటబుల్-బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు లేదా వారి సాధారణ జీర్ణక్రియ పనితీరులో సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారు సాధారణ భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవాలి. ఏసిడిటీకి గురయ్యేవారు ఈ విధంగా తింటే కడుపు ఉబ్బరం సమస్యల్ని ఎదుర్కొంటారు. పుచ్చకాయను ఆహారంతో కలిపి తినడం కన్నా, ఆహారానికి ఆహారానికి మధ్య తింటే బెటరని డాక్టర్లు చెబుతున్నారు. పరిమితంగా తినాలి, పాల పదార్థాలు, వేయించిన ఆహారంతో తినొచ్చు. ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే చల్లగా తినకూడదు.
తాజావార్తలు
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..