మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వేసవి వచ్చిదంటే చాలు ఎండలకు భయపడి బయటకు పోవాలంటే నరకం కనపడుతుంది. కొద్దిసేపు ఎండకు తిరగారంటే చాలు శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి జలదాహం, నీరసం, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో శరీరాన్ని చల్లగా ఉంచే, హైడ్రేటెడ్గా నిలిపే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దోసకాయ సలాడ్ ఎండ కాలంలో అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది.